Watch: ఆర్టీసీ బస్సులో గర్భిణీకి పురిటి నొప్పులు.. రూటు మార్చి డ్రైవర్‌ చేసిన పనితో తల్లీ బిడ్డా క్షేమం..!

|

May 30, 2024 | 1:19 PM

తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రసవ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని, ప్రసవం విజయవంతమైందని ఆసుపత్రి వైద్య సిబ్బంది పేర్కొన్నారు. తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందని, బాగుందని చెప్పారు. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించటం వల్లే తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారని కొనియాడారు.

Watch: ఆర్టీసీ బస్సులో గర్భిణీకి పురిటి నొప్పులు.. రూటు మార్చి డ్రైవర్‌ చేసిన పనితో తల్లీ బిడ్డా క్షేమం..!
Ksrtc Bus
Follow us on

KSRTC బస్సులో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ నిండు గర్భిణీకి మార్గమధ్యలో పురిటి నొప్పుల రావటంతో బస్సులోనే ఆమెకు పురుడు పోశారు తోటి ప్రయాణికులు..దాంతో ఆ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిసింది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీ కెమెరాలో రికార్డు కాగా, సోషల్ మీడియాలో వార్త వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

బస్సులో ప్రయాణిస్తున్న గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. త్రిసూర్ నుంచి కోజికోడ్ వెళ్తున్న బస్సులో ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 37 ఏళ్ల మహిళకు రవాణా సిబ్బంది, వైద్యులు, స్థానికులు సకాలంలో సహాయం అందించి ఆమెకు సుఖప్రసవం అయ్యేలా చేశారు. చివరకు తల్లి బిడ్డను సురక్షితంగా రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో కనిపించింది. అనంతరం వైద్యులు బస్సు వద్దకు చేరుకుని వారికి తదుపరి చికిత్స అందించారు. ఫుటేజీలో సిబ్బంది సంతోషకరమైన స్పందనలు రికార్డయ్యాయి. ప్రస్తుతం వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మే 29న ప్రభుత్వం నిర్వహిస్తున్న కేఎస్‌ఆర్‌టీసీ బస్సులో నిండు గర్భిణి ప్రయాణిస్తోంది. బస్సు చాలా దూరం ప్రయాణించి పెరమంగళం ప్రాంతం దాటిన తర్వాత ఆ మహిళకు తీవ్రమైన ప్రసవ నొప్పులు రావడం ప్రారంభించింది. ఈ విషయం తెలుసుకున్న బస్సు డ్రైవర్ వెంటనే డిపోకు సమాచారం అందించాడు.. బస్సును త్రిసూర్ వైపు మళ్లించాడు. బస్సు సిబ్బంది సహాయం కోసం త్రిసూర్‌లోని అమలా ఆసుపత్రికి ఫోన్ చేసి అప్రమత్తం చేశారు. ఆసుపత్రికి చేరుకున్న తర్వాత, వైద్యులు మహిళను వార్డుకు తీసుకెళ్లడంలో సమయాన్ని వృథా చేయలేదు. బస్సులోనే అవసరమైన ప్రక్రియను చేపట్టారు. బస్సులోనే ఆమెకు సుఖప్రసవం అయ్యేలా చేశారు. డెలివరీ తర్వాత, తల్లి, బిడ్డను తదుపరి సంరక్షణ కోసం ఆసుపత్రిలో చేర్చారు.

బస్సు సిబ్బంది సమీపంలోని ఆసుపత్రికి సమాచారం అందించారు. తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రసవ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని, ప్రసవం విజయవంతమైందని ఆసుపత్రి వైద్య సిబ్బంది పేర్కొన్నారు. తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందని, బాగుందని చెప్పారు. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించటం వల్లే తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారని కొనియాడారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..