అమెరికాలో మరో హైదరాబాద్‌ విద్యార్థి మృతి.. 48 గంటల్లోనే 2 మరణాలు!

శనివారం తెల్లవారు జామున హైదరాబాద్‌కు చెందిన 28 ఏళ్ల దళిత విద్యార్థి చంద్రశేఖర్ పోల్ డల్లాస్‌లో కాల్చి చంపబడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే తాజాగా మరో హైదరాబాద్ విద్యార్థి మృతి చెందాడు. అమెరికాలో 48 గంటల్లో రెండోసారి హైదరాబాద్ విద్యార్థి మరణం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన మరో విద్యార్ధి..

అమెరికాలో మరో హైదరాబాద్‌ విద్యార్థి మృతి.. 48 గంటల్లోనే 2 మరణాలు!
Hyderabad Student Shot Dead In Dallas

Updated on: Oct 06, 2025 | 10:45 AM

హైదరాబాద్‌, అక్టోబర్ 6: గడచిన 48 గంటల్లో అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్ధులు మృతి చెందారు. శనివారం తెల్లవారు జామున హైదరాబాద్‌కు చెందిన 28 ఏళ్ల దళిత విద్యార్థి చంద్రశేఖర్ పోల్ డల్లాస్‌లో కాల్చి చంపబడ్డ సంగతి తెలిసిందే. తాజాగా మరో హైదరాబాద్ విద్యార్థి మృతి చెందాడు. అమెరికాలో 48 గంటల్లో రెండోసారి హైదరాబాద్ విద్యార్థి మరణం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల షెరాజ్ మెహతాబ్ మొహమ్మద్ అనే విద్యార్థి అక్టోబర్ 5వ తేదీ (ఆదివారం) నాడు అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. షెరాజ్ చంచల్‌గూడ ప్రాంతానికి చెందినవాడు. ఇటీవలే అమెరికాకు వెళ్లినట్లు సమాచారం.

ఇదే 48 గంటల్లో జరిగిన రెండో మృతి. అంతకు ముందు రోజు మరో హైదరాబాద్ విద్యార్థి 28 ఏళ్ల యువకుడు చంద్రశేఖర్ పోలే టెక్సాస్లోని డల్లాస్లో కాల్పుల్లో మృతిచెందాడు. బీఎన్ నగర్కు చెందిన చంద్రశేఖర్ డల్లాస్లోని గ్యాస్ స్టేషన్లో పార్ట్ టైమ్‌ పనిచేస్తూ తన ఖర్చులు నెట్టుకొచ్చేవాడు. శనివారం తెల్లవారుజామున దొంగల దాడిలో ఆయన కాల్పులకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. చంద్రశేఖర్ డెంటల్ సర్జరీలో పట్టా సాధించాడు. 2023 ఆగస్టు 21 నుంచి డెంటన్లోని నార్త్ టెక్సాస్ విశ్వవిద్యాలయంలో డేటా అనలిటిక్స్లో మాస్టర్స్ చదువుతున్నాడు.

చంద్రశేఖర్‌ మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. మరణించిన విద్యార్థి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడంలో ప్రభుత్వ సహాయం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.