Telangana: మరో షాకింగ్ న్యూస్.. బస్ పాస్ ధరలను భారీగా పెంచిన TSRTC

తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో టికెట్ తీసుకుంటున్న ప్రయాణికులు కొత్త ఛార్జీలను చూసి కంగుతింటున్నారు. ప్రయాణికులకు పూర్తి స్థాయి సమాచారం లేకుండానే ఛార్జీల పెంపు జరిగిపోతుంది.

Telangana:  మరో షాకింగ్ న్యూస్.. బస్ పాస్ ధరలను భారీగా పెంచిన TSRTC
Tsrtc

Updated on: Mar 28, 2022 | 5:39 PM

సైలెంట్‌గా వడ్డన కొనసాగిస్తోంది TSRTC. ఈనెల 18వ తేదీన ఆర్టీసీ పల్లె వెలుగు(palle velugu) బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్ పేరుతో ఛార్జీలను రౌండప్‌ చేశారు. దీనిపై ప్రజలకు ఇంకా అవగాహన రాలేదు.  ఇక తాజాగా సెస్ పేరిట ఎక్స్​ప్రెస్, డీలక్స్ బస్సుల్లో రూ.5 పెంచారు. సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ.10 వరకు ఛార్జీలను పెంచేశారు. వీటి గురించి చాలామందికి తెలీనే తెలీదు. తాజాగా ప్రయాణీకులకు మరో ఝలక్ ఇచ్చింది టీఎస్‌ఆర్టీసీ. బస్ పాస్ ధరలను భారీగా పెంచేసింది.  జనరల్ ఆర్డినరీ బస్ పాస్ ధర 970 నుంచి 1150కి పెంపునట్లు తెలిపింది. మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాస్ ధర 1070 నుంచి 1300 చేసినట్లు వెల్లడించింది. ఇక మెట్రో డీలక్స్ ధర 1185 నుంచి 1450కి పెంచినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ బస్ పాస్ ధర 1100 నుంచి 1350కి పెంచారు.  పుష్పక్ ఏసీ పాస్ ధర గతంలో 2500 ఉండగా.. ప్రజంట్ 3000 కు చేరింది. పెరిగిన బస్ పాస్ ధరలు శుక్రవారం నుంచి అమలు అవుతాయని TRSTC  వెల్లడించింది.

Also Read: ఓన్లీ రూపాయి నాణేలతో బైక్ కొన్న యువకుడు.. కౌంట్ చేయలేక కళ్ళు తేలేసిన షోరూం స్టాఫ్!

Loading...
Unable to load recommendations.
Follow Us