AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పల్టీ కొట్టిన ఆర్టీసీ బస్సు..

వనపర్తి జిల్లా కొత్తకోట బైపాస్ వద్ద ఆర్టీసీ బస్సు బోల్తాపడిండి. తిరుపతి కి వెళ్తున్న యాదగిరిగుట్టకు చెందిన ఆర్టీసి‌బస్సు కొత్తకోట బైపాస్ వద్దకు రాగానే గుంతలో పల్టీ కొట్టింది‌. ప్రమాద సమయంలో మొత్తం 37 మంది ప్రయాణికులున్నారు.

Telangana: వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పల్టీ కొట్టిన ఆర్టీసీ బస్సు..
Road Accident
Shiva Prajapati
|

Updated on: Feb 12, 2023 | 6:35 AM

Share

వనపర్తి జిల్లా కొత్తకోట బైపాస్ వద్ద ఆర్టీసీ బస్సు బోల్తాపడిండి. తిరుపతి కి వెళ్తున్న యాదగిరిగుట్టకు చెందిన ఆర్టీసి‌బస్సు కొత్తకోట బైపాస్ వద్దకు రాగానే గుంతలో పల్టీ కొట్టింది‌. ప్రమాద సమయంలో మొత్తం 37 మంది ప్రయాణికులున్నారు. వారిలో‌15 మందికి గాయాలయ్యాయి. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు వనపర్తి పోలీసులు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..