
ఖమ్మం జిల్లా చింతకాని మండలం కొదుమూరులో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. ఆర్ఎంపీల ముసుగులో ఒక కారు ఏర్పాటు చేసుకుని.. అందులోనే అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్ సెటప్ చేసుకున్నారు. ముందుగానే ఆ ఊరులోని గర్భిణీల లిస్ట్ తెలుసుకొని..ఆ గ్రామానికి వెళ్ళి ఏమి తెలియనట్లు..గుట్టు చప్పుడు కాకుండా కారులోనే గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
పుట్టబోయే బిడ్డ ఆడ లేదా మగ అని తెలుసుకొని ఆడపిల్ల అయితే అబార్షన్ చేయించుకునే అవకాశం మా దగ్గర ఉందని చూడా చెబుతున్నారు. స్కానింగ్ ద్వారా పరీక్షలు నిర్వహించి, ఏమీ తెలియని అమాయకులైన మహిళలను వలలో వేసుకొని లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు..ఒక్కో పరీక్షకు రూ 10 వేల నుంచి 30 వేల వరకు వసూలు చేస్తున్నారు. వాస్తవానికి వైద్య ఆరోగ్య శాఖ కూడా ఎలా పడితే అలా స్కానింగ్ వంటి పరీక్షలు చేపట్టడం లేదు. గర్భిణీలు ఆసుపత్రులకు వెళ్లినప్పుడు బేబీ హెల్త్ అండ్ గ్రోత్ ప్రొగ్రెస్ తెలుసుకునేందుకు అవసరాన్ని బట్టి వైద్యులు స్కానింగ్ సూచిస్తారు. ఆ రిపోర్టులు చూసి.. పెరుగుతుంది అమ్మాయి లేదా అబ్బాయి అన్న విషయం డాక్టర్లు కానీ ,స్కానింగ్ సెంటర్ యజమానులు ఎక్కడా చెప్పకూడదు. ఇది పెద్ద క్రైమ్. ఊచలు లెక్కబెట్టడం గ్యారంటీ.
అయితే డబ్బు సంపాదనే లక్ష్యంగా కొందరు కాసులకు కక్కుర్తిపడి ఇలాంటి పనులకు ఒడి గడుతున్నారు.. ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నటువంటి ఘరానా మోసగాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టి పట్టుకుంటున్నారు. తాజాగా ముగ్గురు సభ్యులు ముఠాను చింతకాని పోలీసులు అరెస్ట్ చేశారు.
కోదుమూరు గ్రామంలో ఒక అడ్డా ఏర్పాటు చేసుకుని.. స్కానింగ్ పరీక్ష నిర్వహిస్తుండగా నిందితుల్ని అదుపులోకి తీసుకుని.. వారి వినియోగిస్తున్న స్కానింగ్ పరీక్షలు చేసే పరికరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ రెహమాన్ తెలిపారు. ఎవరైనా ఇలాంటి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏసిపి హెచ్చరించారు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.