
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పలు జిల్లాల్లో ముందుగా ఈవీఎంలు మొరాయించాయి. వాటి స్థానంలో కొత్త ఈవీఎంలను ఏర్పాటు చేశారు ఎన్నికల సంఘం అధికారులు. చివరి నిమిషంలో పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు ఓటర్లు. వందల మంది ఒక్కసారిగా రావడంతో చాలా వరకూ పోలింగ్ స్టేషన్లు రద్దీగా మారిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో రాత్రి 9 గంటల వరకూ పోలింగ్ కొనసాగింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిన్న రాత్రి వరకు జరిగిన మొత్తం పోలింగ్ శాతం 70.60గా వెల్లడించారు ఎన్నికల సంఘం అధికారులు. అత్యధికంగా యాదాద్రిలో 90.03శాతం నమోదు కాగా.. హైద్రాబాద్లో అత్యల్పంగా 46.56 శాతం నమోదైంది. ఓటు వేసేందుకు సుముఖత చూపించలేదు హైదరాబాదీలు.
అచ్చంపేట, జనగామతోపాటూ ఓల్డ్ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమొదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదాలు, తోపులాటలతో కూడిన చిన్నపాటి ఘర్షణ వాతావరణం నెలకొంది. వీరిని పోలీసులు చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఏజెన్సీలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం ఓటింగ్ 4 గంటలకే ముగించారు. పోలింగ్ ముగిసిన ప్రాంతాల్లోని ఈవీఎంలను సీల్ చేసి స్ట్రాంగ్ రూములకు తరలించారు అధికారులు. ఇలాంటి పరిస్థితుల మధ్య పోలింగ్ ఎంత శాతం నమోదైందో జిల్లాల వారీగా ఇప్పుడు చూద్దాం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..