ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్ల రచ్చ

|

Dec 14, 2019 | 2:32 PM

టీఎస్‌ ఆర్టీసీలో ఇంకా అసంతృప్తి సెగలు రగులుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవలే 55 రోజులపాటు సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ సిబ్బింది . సీఎం కేసీఆర్‌ ప్రకటనతో తిరిగి విధుల్లో చేరారు. ఆర్టీసీ సమ్మెకు ప్రధాన  కారణం యూనియన్లే నంటూ సీఎం ప్రకటన నేపథ్యంలో వెనక్కి తగ్గిన యూనియన్‌ నేతలు మరోమారు తమ గళం వినిపించేందుకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలోనే ఆర్టీసీలో ఏ ఒక్క కార్మికుడు తృప్తిగా పనిచేయడం లేదంటూ ఆరోపించారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. ఈ మేరకు […]

ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్ల రచ్చ
Follow us on

టీఎస్‌ ఆర్టీసీలో ఇంకా అసంతృప్తి సెగలు రగులుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవలే 55 రోజులపాటు సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ సిబ్బింది . సీఎం కేసీఆర్‌ ప్రకటనతో తిరిగి విధుల్లో చేరారు. ఆర్టీసీ సమ్మెకు ప్రధాన  కారణం యూనియన్లే నంటూ సీఎం ప్రకటన నేపథ్యంలో వెనక్కి తగ్గిన యూనియన్‌ నేతలు మరోమారు తమ గళం వినిపించేందుకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలోనే ఆర్టీసీలో ఏ ఒక్క కార్మికుడు తృప్తిగా పనిచేయడం లేదంటూ ఆరోపించారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి.

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..టీఎస్ ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లు ఉండాలని.. ఎన్నికలు జరపాల్సిందేనని స్పష్టం చేశారు. యూనియన్లకు సంబంధించి రహస్య ఓటింగ్ పెట్టాలన్నారు. ఎక్కువ మంది అభిప్రాయాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలన్నారు. లేదంటే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. రెండు సంవత్సరాల వరకు ఎన్నికలు వద్దని బలవంతంగా కార్మికుల దగ్గర సంతకాలు తీసుకుంటున్నారని అశ్వత్థామరెడ్డి మండిపడ్డారు. 3500 బస్సుల్లో వెయ్యి బస్సులను తగ్గించి పని భారం పెంచుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికలోకం తీవ్ర ఆవేదనలోనే పనిచేస్తోందని చెప్పుకొచ్చారు.