Telangana: దేశంలో కరోనా తగ్గడానికి ఏసుక్రీస్తే కారణం.. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

|

Dec 21, 2022 | 5:19 PM

ప్రపంచంలో కరోనా కేసులు పెరుగుతున్నాయన్న ఆందోళన నేపథ్యంలో దేశంలో కోవిడ్ నియంత్రణకు అనేక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా కేసులు తగ్గడానికి కారణం ఏసుక్రీస్తేనంటూ కీలక వ్యాఖ్యలు..

Telangana: దేశంలో కరోనా తగ్గడానికి ఏసుక్రీస్తే కారణం.. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Srinivas Rao, Dh, Telangana
Follow us on

ప్రపంచంలో కరోనా కేసులు పెరుగుతున్నాయన్న ఆందోళన నేపథ్యంలో దేశంలో కోవిడ్ నియంత్రణకు అనేక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా కేసులు తగ్గడానికి కారణం ఏసుక్రీస్తేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవ మతమే మానవ మనుగడకు అభివృద్ధి నేర్పిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన సెమి క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత దేశాభివృద్ధికి క్రైస్తవమతమే కారణమన్నారు. ఏసుక్రీస్తు దయవల్లే కోవిడ్ తగ్గుముఖం పట్టిందన్నారు. ఇటీవల కాలంలో ఆయన చేసిన పనులు వివాదస్పదమవుతూ వస్తున్నాయి. ఏసు క్రీస్తు దయ, కృప వల్లే కరోనా కట్టడి అయ్యిందన్నారు. మనం మంచి చేయడం వల్ల తగ్గిందని చాలామంది అనుకుంటున్నారని, కాని వాస్తవం అది కాదన్నారు హెల్త్ డైరెక్టర్‌ శ్రీనివాస్. సృష్టిలో అనేక జాతులు ఉన్నాయని, ఏ జాతికి లేని ప్రమాదం మానవ జాతికే ఎందుకు వచ్చిందన్నారు.

మావన జాతి అస్థిత్వమే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం వచ్చిందంటూ వ్యాఖ్యానించారు. చాలా మంది దేవుళ్లు ఉన్నా.. భూమి మీద నడయాడింది ఏసుప్రభు మాత్రమేనని అన్నారు. పూర్వీకులు ఇదంతా చూశారని, భవిష్యత్తు తరాల వారిక చెప్పాలని అన్నారు శ్రీనివాస్. క్రీస్తు సందేశాన్ని భవిష్యత్ తరాలకు చేరవేయాలని, కుల, మతాలంటూ ఏవీ లేవన్నారు. ఉన్నది ఒక్కటే మానవ జాతి అంటు భద్రాద్రి కొత్తగూడెంలో హెల్త్ డైరెక్టర్‌ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పలు జాగ్రత్తలుత తీసుకోవడం ద్వారా కోవిడ్ ను నియంత్రించవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..