కాలికి చిన్న గాయం.. ఎలుక కరిచిందేమో అని లైట్ తీసుకుంది.. కొన్ని గంటలు గడిచేసరికి..!

పాము కాటుతో విద్యార్థి మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామంలో చోటుచేసుకుంది.. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామానికి చెందిన సింధుజ(17) ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఇల్లు శుభ్రం చేస్తున్న క్రమంలో పాము కాటుకు గురైంది. ఎలుక కరిచిందని భావించిన కుటుంబసభ్యులు నిర్లక్ష్యం చేశారు.

కాలికి చిన్న గాయం.. ఎలుక కరిచిందేమో అని లైట్ తీసుకుంది.. కొన్ని గంటలు గడిచేసరికి..!
Student Dies With Snakebite

Edited By:

Updated on: Mar 20, 2026 | 9:54 PM

పాము కాటుతో విద్యార్థి మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామంలో చోటుచేసుకుంది.. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామానికి చెందిన సింధుజ(17) ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఇల్లు శుభ్రం చేస్తున్న క్రమంలో పాము కాటుకు గురైంది. ఎలుక కరిచిందని భావించిన కుటుంబసభ్యులు నిర్లక్ష్యం చేశారు. పాము కాటును సీరియస్ గా తీసుకోకుండా ఉండడంతో సాయంత్రం ఆమె నోటి నుంచి నురగలు రావడంతో భయాందోళనలకు గురయ్యారు. వెంటనే గమనించిన కుటుంబీకులు హుటాహుటిన సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అయితే అప్పటికే బాలిక పరిస్థితి విషమించింది. ఆమెను పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం సూచించారు. దీంతో హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం (మార్చి 20) మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా సింధుజ దౌల్తాబాద్ లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఒకేషనల్ కోర్సు చేస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సింధుజ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us