AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పసిపిల్లాడి ప్రాణంతో ఆసుపత్రి సిబ్బంది చెలగాటం.. వైద్యుల నిర్లక్ష్యానికి ఆర్నెళ్ల బాలుడు బలి..!

హైదరాబాద్ నగరంలో జరిగిన హృదయవిదారక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. వైద్యుల నిర్లక్ష్యానికి ముక్కుపచ్చలు ఆరని చిన్నారి ప్రాణాలు వదిలింది. అనారోగ్యంతో తీసుకువచ్చిన శిశువుకు గడువు ముగిసిన మందులతో చికిత్స అందించడంతో మృతి చెందాడు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు హాస్పిటల్ పై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు.

పసిపిల్లాడి ప్రాణంతో ఆసుపత్రి సిబ్బంది చెలగాటం.. వైద్యుల నిర్లక్ష్యానికి ఆర్నెళ్ల బాలుడు బలి..!
Crayons Hospital
Balaraju Goud
|

Updated on: Feb 21, 2026 | 6:05 PM

Share

హైదరాబాద్ నగరంలో జరిగిన హృదయవిదారక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. వైద్యుల నిర్లక్ష్యానికి ముక్కుపచ్చలు ఆరని చిన్నారి ప్రాణాలు వదిలింది. అనారోగ్యంతో తీసుకువచ్చిన శిశువుకు గడువు ముగిసిన మందులతో చికిత్స అందించడంతో మృతి చెందాడు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు హాస్పిటల్ పై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ జాగీర్ లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న క్రియాన్స్ హాస్పిటల్‌లో చికిత్స నిమిత్తం తీసుకువచ్చిన ఆరు నెలల శిశువు మృతి చెందడం ఉద్రిక్తతకు దారి తీసింది. విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తి తన ఆరు నెలల ముద్దుల కొడుకును అనారోగ్యంతో హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. వైద్యులు చికిత్సలో భాగంగా మందులు అందజేశారు. మందులు ఇచ్చిన కొద్దిసేపటికే శిశువు ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అయితే ఆ మందులు గడువు ముగిసినవని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

బాలుడు మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహంతో హాస్పిటల్‌లో ఆందోళనకు దిగారు. కొంతమంది కోపోద్రిక్తులై హాస్పిటల్ ఆస్తులను ధ్వంసం చేశారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హాస్పిటల్ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. శిశువు మృతికి గల అసలు కారణాలపై పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా కు తరలించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక..
ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక..
ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..
కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..
అతి తక్కువ ఖర్చులో డబుల్ బెడ్రూం ఇల్లు.. బెస్ట్ ప్లాన్
అతి తక్కువ ఖర్చులో డబుల్ బెడ్రూం ఇల్లు.. బెస్ట్ ప్లాన్