
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పలు గ్రామాలలోని యువత ఆదర్శవంతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్లో గ్రామ అభివృద్ధి కమిటీ,యువత సమావేశమై రానున్న ఎన్నికల్లో డబ్బు, మద్యం తీసుకోకుండా రాజ్యాంగబద్ధంగా ఓటు హక్కు వినియోగించు కోవాలని నిర్ణయించారు.ఓటు హక్కు ఎంత విలువైనదో చెప్పే విధంగా గ్రామానికి చెందిన మేధావులు, గ్రామ పెద్దలు, యువత సమావేశమై ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి డబ్బు పంచకుండా, ఓటరు కూడా డబ్బు, మద్యానికి తన ఓటును అమ్ముకోకుండా తీర్మానం చేశామని గ్రామ యువకులు తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామంలోని యువకులు మాట్లాడుతూ..ఒక వ్యక్తి ఓటు హక్కు ఎంతో విలువైనదని,ఆ ఓటు హక్కును డబ్బుకు,మద్యానికి అమ్ముకోకుండా ఓటు వెయ్యాలనేదే తమ లక్ష్యమన్నారు. రాజకీయ నాయకులు ఎన్నికలు రాగానే ఓట్ల కోసం డబ్బులు, మద్యం పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తురన్నారని..స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ గ్రామంలో డబ్బు,మద్యం తీసుకోకుండా,పంచకుండా,తీర్మానం చేశామని తెలిపారు.రాష్ట్రంలోని మిగతా గ్రామాలు కూడా ఈ విధంగా ఆలోచించాలని కోరారు.
ప్రతి గ్రామంలోని యువత ఇదే తీరుగా ఆలోచించి.. తమ గ్రామంలోని చదువుకోని తల్లిదంద్రులు, బంధువులు, తెలిసిన వారికి దీనిపై అవగాహన కల్పించాలని వారు కోరుతున్నారు. ఎలక్షన్ల సమయంలో మనం డబ్బు తీసుకోకుండా ఓటు వేస్తేనే ఎన్నిల తర్వాత మనం ప్రజాప్రతినిధులను ప్రశ్నించగమని చెబుతున్నారు.కాబట్టి ప్రతి ఒక్కరూ డబ్బు తీసుకోకుండా ఓటు వేయాలని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.