Telangana: మంచోడని రూ.15 లక్షల కట్నం.. 10 తులాల బంగారం ఇచ్చి పెళ్లి చేశారు.. చివరకు..

వివాహ సమయంలో 15 లక్షల వరకట్నంతో పది తులాల బంగారం తో పాటు తదితర లాంఛనాలను పుట్టింటి వారు శ్రావణ్ కు అప్పగించారు. అయినా సంతృప్తి చెందని శ్రావణ్ కావ్యను పలుమార్లు కట్నం కోసం వేధించారు.. శ్రావణ్, అత్తమామల వేధింపులు ఎక్కువ కావడంతో కావ్య.. తన కుటుంబ సభ్యులకు ఈ విషయం గురించి చెప్పింది.

Telangana: మంచోడని రూ.15 లక్షల కట్నం.. 10 తులాల బంగారం ఇచ్చి పెళ్లి చేశారు.. చివరకు..
Peddapalli dowry harassment case

Edited By:

Updated on: Jan 13, 2026 | 2:50 PM

పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వరకట్న వేధింపులతో యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామానికి చెందిన కావ్య (22) ను.. మూడు సంవత్సరాల క్రితం పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన శ్రావణ్ అనే యువకునికి ఇచ్చి వివాహం జరిపించారు. వివాహ సమయంలో 15 లక్షల వరకట్నంతో పది తులాల బంగారం తో పాటు తదితర లాంఛనాలను పుట్టింటి వారు శ్రావణ్ కు అప్పగించారు. అయినా సంతృప్తి చెందని శ్రావణ్ కావ్యను పలుమార్లు కట్నం కోసం వేధించారు.. శ్రావణ్, అత్తమామల వేధింపులు ఎక్కువ కావడంతో కావ్య.. తన కుటుంబ సభ్యులకు ఈ విషయం గురించి చెప్పింది. దీంతో వారు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టారు.

పంచాయితీ పెట్టి.. పెద్ద మనుషులు శ్రావణ్ తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఇద్దరూ కలుసుండాలని సూచించారు. అప్పుడు సరేనని ఒప్పుకున్న శ్రావణ్.. తన దుర్భుద్దిని మరోసారి చూపించాడు.. వేధింపులు మరింత పెరగడంతో తీవ్రంగా మనోవేదన చెందిన కావ్య.. ఈరోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కావ్య మరణానికి కారణమైన శ్రావణ్ పై చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..