తెలంగాణలోకి ఏ పాసులు ఉంటే అనుమ‌తి ఇస్తారు.. న‌ల్ల‌గొండ డిఐజి రంగ‌నాథ్ క్లారిటీ

|

May 24, 2021 | 3:23 PM

అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద లాక్ డౌన్ మినహాయింపు సమయంలోనూ ఈ పాస్ ఉంటేనే అనుమతిస్తామ‌ని నల్లగొండ డిఐజి రంగనాధ్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా...

తెలంగాణలోకి ఏ పాసులు ఉంటే అనుమ‌తి ఇస్తారు.. న‌ల్ల‌గొండ డిఐజి రంగ‌నాథ్ క్లారిటీ
E Pass
Follow us on

అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద లాక్ డౌన్ మినహాయింపు సమయంలోనూ ఈ పాస్ ఉంటేనే అనుమతిస్తామ‌ని నల్లగొండ డిఐజి రంగనాధ్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా ఏపీ, తెలంగాణ పోలీసులు జారీ చేసిన పాస్ ఉంటేనే అనుమతి ఉంటుంద‌న్నారు. అంబులెన్సులకు ఎలాంటి ఆంక్షలు లేవని, ప్రైవేట్ వాహనాలలో ఆంధ్రా నుండి తెలంగాణకు వచ్చే కోవిడ్, ఇతర రోగులు ఆస్పత్రుల నుండి ఇచ్చిన లెటర్స్, సంబంధిత పత్రాలు ఉంటేనే అనుమతిస్తామ‌ని చెప్పారు. లాక్ డౌన్ మినహాయింపు సమయంలోనూ (ఉదయం 6.00 నుండి 10.00 గంటల వరకు) ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వాహనాలు విధిగా ఈ పాస్ కలిగి ఉంటేనే అనుమతిస్తామ‌ని చెప్పారు. ఆంధ్రా నుండి తెలంగాణలోకి వచ్చే వారు పోలీసుల సూచనలు పాటించాలని, ఈ పాస్ లేకుండా వచ్చి సరిహద్దుల వద్ద ఇబ్బందులు పడవద్దని సూచించారు.

ఈ పాస్, ఎలాంటి అనుమతి లేకుండా వస్తున్న వాహనాలతో బోర్డ‌ర్స్ వ‌ద్ద‌ వాహనాల రద్దీ పెరిగిపోతుందని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ పాస్ పొందలేని వారు సరైన ఆధారాలు చూపించి అత్యవసర వైద్యం కోసం వచ్చినట్లయితే విచారించి అలాంటి వాహనాలను మానవతా దృక్పథంతో అనుమతిస్తామ‌ని చెప్పారు.

లాక్ డౌన్ పరిశీలించిన డిఐజి రంగనాధ్….

నల్లగొండ పట్టణంలో పలు ప్రాంతాలలో లాక్ డౌన్ అమలును స్వయంగా తిరుగుతూ పరిశీలించారు డిఐజి రంగనాధ్. ప‌లు కాలనీలలో తెరిచి ఉంచిన షాపులపై ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఒక ప్రాంతంలో మద్యం విక్రయాలు చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి కేసు నమోదు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

Also Read: దేశంలో ఎల్లో ఫంగస్ వ్యాప్తి..​ యూపీ​లో తొలి కేసు నమోదు.. ల‌క్ష‌ణాలు ఇవి

ఎంపీ రఘురామకృష్ణ రాజు విడుదలపై కొనసాగుతున్న టెన్షన్.. నాలుగు రోజుల తర్వాతే బయటకు..!