Telangana: ఎంత పని చేశావమ్మా.. కవల పిల్లలు సహా తల్లి ఆత్మహత్య.. చెరువులోకి దూకి..
తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా (mahbubnagar district) లో విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి ముగ్గురు పిల్లలతో సహా చెరువులోకి దూకింది.
Mother ends life along with two kids: తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా (mahbubnagar district) లో విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి ముగ్గురు పిల్లలతో సహా చెరువులోకి దూకింది. ఈ ఘటనలో తల్లితో సహా ఇద్దరు కవల పిల్లలు మృతిచెందారు. పెద్ద కూతురు నవ్య ప్రాణాలతో బయటపడింది. ఈ విషాద ఘటన జిల్లాలోని నవాబ్పేట మండలం కాకర్లపాడులో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. మృతులు రమాదేవి(35), మేఘన(8), మారుతి(8) గా గుర్తించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్లో భర్తతో గొడపడి వచ్చిన రమాదేవి.. సాయంత్రం ముగ్గురు పిల్లలను తీసుకొని కాకర్లపాడులోని నల్లకుంట చెరువు దగ్గరికి వెళ్లింది. అనంతరం నల్లకుంటలో పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో తల్లి రమాదేవి, కవలపిల్లలు మేఘన, మారుతి మరణించగా.. చెరువు నుంచి పెద్ద కుమార్తె సురక్షితంగా బయటపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..