Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLC Kavitha: అయోధ్యలో రాములవారి విగ్రహ ప్రతిష్టాపన.. ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర ట్వీట్..

అయోధ్య రామమందిరంలో వచ్చే నెల శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపనతో కోట్లాది హిందువుల కల నిజం కాబోతుందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అయోధ్యలో గర్భగుడి ఫొటోలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విడుదల చేసిన క్రమంలో కవిత ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

MLC Kavitha: అయోధ్యలో రాములవారి విగ్రహ ప్రతిష్టాపన.. ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర ట్వీట్..
MLC Kavitha
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 11, 2023 | 12:33 PM

అయోధ్య రామమందిరంలో వచ్చే నెల శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపనతో కోట్లాది హిందువుల కల నిజం కాబోతుందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అయోధ్యలో గర్భగుడి ఫొటోలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విడుదల చేసిన క్రమంలో కవిత ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ట్రస్ట్ విడుదల చేసిన అయోధ్య రామ మందిరం గర్భగుడికి సంబంధించిన ఫొటోలతో రూపొందించిన వీడియోను పోస్ట్‌కు జత చేశారు. ఈ శుభసమయంలో తెలంగాణతో పాటు దేశ ప్రజలందరూ స్వాగతించాల్సిన శుభ ఘడియలన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలన్న హిందువుల ఆకాంక్ష త్వరలో నెరవేరుతుండడం సంతోషకరమన్నారు. రామాలయాన్ని సందర్శించడానికి ఎంతోమంది ఎదురుచూస్తున్నారని తెలిపారు.

‘శుభ పరిణామం.. అయోధ్యలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ప్రతిష్ట, కోట్లాది హిందువుల కల నిజం కాబోతున్న శుభ సమయంలో.. తెలంగాణతో పాటు దేశ ప్రజలందరూ స్వాగతించాల్సిన శుభ ఘడియలు.. జై సీతారామ్!’ అని ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్‌లో పోస్ట్ ద్వారా పేర్కొన్నారు.