
ఆపరేషన్ సిందూర్ పేరుతో పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఒక రాత్రిలోనే మూడు టెర్రర్ హెడ్క్వార్టర్స్ నేలమట్టం చేసింది. 26/11 దాడులకు ప్రతీకారంగా మురిడ్కేలో ఆర్మీ దాడులు చేసింది. పుల్వామా ఎటాక్కి ప్రతీకారంగా బహావల్పూర్లో మెరుపు దాడులు చేసింది. J&Kలో జరిగిన పెద్ద దాడులకు ప్రతీకారంగా హిజ్బుల్ సియాల్కోట్పై ఎయిర్ స్ట్రైక్ చేసింది.. ఒక దెబ్బకు మూడు పిట్టలు అనేలా.. రాత్రిరాత్రికే మూడు టెర్రర్ హెడ్క్వార్టర్స్ నేలమట్టం చేసింది ఇండియన్ ఆర్మీ.. మొత్తంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసింది. 100 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. భారత సాయుధ దళాలు బహవల్పూర్లోని జైష్-ఎ-మొహమ్మద్ బలమైన స్థావరం, మురిడ్కేలోని లష్కరే-ఎ-తోయిబా స్థావరంతో సహా తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై క్షిపణి దాడులు నిర్వహించాయి
ఆపరేషన్ సిందూర్ పై అభినందనల వెల్లువ వ్యక్తమవుతోంది.. భారత్ మాతాకీ జై.. జైహింద్ అంటూ కిషన్రెడ్డి ట్వీట్ చేశారు.
Bharat Mata Ki Jai!
Har Har Mahadev
Jai Hind🇮🇳#OperationSindoor pic.twitter.com/Ee2ptf1hh6
— G Kishan Reddy (@kishanreddybjp) May 6, 2025
భారత్ మెరుపుదాడులపై బండి సంజయ్ ట్వీట్ చేశారు. పాక్ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. మేరా భారత్ మహాన్.. జై హింద్ అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు.
From words to actions –
“We will pursue terrorists to the ends of the earth.” – Hon’ble PM Shri @narendramodi Ji vowed.
Operation Sindoor delivered.
Terror camps shattered, enemies punished.
Under Modi Ji, India doesn’t forget or forgive.
Pahalgam martyrs avenged.
Jai Hind!… pic.twitter.com/g6wH9BZ2mg— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) May 6, 2025
मैं हमारी रक्षा सेनाओं द्वारा पाकिस्तान में आतंकवादी ठिकानों पर किए गए लक्षित हमलों का स्वागत करता हूँ। पाकिस्तानी डीप स्टेट को ऐसी सख्त सीख दी जानी चाहिए कि फिर कभी दूसरा पहलगाम न हो। पाकिस्तान के आतंक ढांचे को पूरी तरह नष्ट कर देना चाहिए। जय हिन्द! #OperationSindoor
— Asaduddin Owaisi (@asadowaisi) May 7, 2025
పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై మన రక్షణ దళాలు నిర్వహించిన సర్జికల్ దాడులను నేను స్వాగతిస్తున్నాను. మరో పహల్గామ్ ఘటన మళ్లీ జరగకుండా పాకిస్తాన్ కు గట్టి గుణపాఠం నేర్పించాలి. పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలి. జై హింద్! అంటూ అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..