
టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ నిర్వహించిన ‘క్రాస్ఫైర్’ ఇంటర్వ్యూలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పలు ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. తా తాను సాంకేతికంగా ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని, కాంగ్రెస్తో తనకు సంబంధం లేదని స్పీకర్కు అఫిడవిట్ ఇచ్చిన మాట వాస్తవమేనని ఆయన స్పష్టం చేశారు. అయితే, నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను అధికార కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తున్నట్లు వెల్లడించారు.
పార్టీ ఫిరాయింపులకు అతీతుడిని కాదన్న కడియం శ్రీహరి.. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీతో ప్రయాణించిన వారిలో నేను మొదటివాడిని కాదు, చివరివాడిని కాను అన్నారు. పార్టీ మారలేదన్న కడియం శ్రీహరి, కేవలం అధికార పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నానని తెలిపారు. ఇప్పటివరకు బీఆర్ఎస్ నాకు ఎలాంటి షోకాజ్ నోటీసు కూడా ఇవ్వలేదు అని కడియం పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..