వనస్థలిపురంలో మహిళపై యువకుల అత్యాచారం

కొత్తపేటకు చెందిన ఓ మహిళ వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించింది. ఓ వ్యక్తి తనను కలవాలంటూ పిలిపించి స్నేహితులతో కలిసి తనపై సామూహిక అత్యాచారం చేశారని ఆరోపించింది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పలువురు యువకులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు కొత్తపేటకు చెందిన ఓ మహిళ సోమవారం (ఏప్రిల్ 15) వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేటకు చెందిన ఓ మహిళ (32)కు […]

వనస్థలిపురంలో మహిళపై యువకుల అత్యాచారం

Updated on: Apr 16, 2019 | 7:45 AM

కొత్తపేటకు చెందిన ఓ మహిళ వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించింది. ఓ వ్యక్తి తనను కలవాలంటూ పిలిపించి స్నేహితులతో కలిసి తనపై సామూహిక అత్యాచారం చేశారని ఆరోపించింది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పలువురు యువకులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు కొత్తపేటకు చెందిన ఓ మహిళ సోమవారం (ఏప్రిల్ 15) వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేటకు చెందిన ఓ మహిళ (32)కు ఐదేళ్ల కిందట వివాహమైంది. రెండేళ్ల కిందట భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమె వేరుగా ఉంటోంది. వనస్థలిపురంలోని మ్యాక్స్‌లైఫ్ పాలసీ సంస్థలో పనిచేస్తున్న తనకు 6 నెలల కిందట మన్సూరాబాద్‌కు చెందిన మనోజ్‌కుమార్ ‌(30) అనే వ్యక్తితో పరిచయమైనట్లు తెలిపింది. మనోజ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

శనివారం మధ్యాహ్నం ఓ పని నిమిత్తం మనోజ్‌కు ఫోన్‌ చేయగా తన స్నేహితులతో వనస్థలిపురంలోని స్నేహమయినగర్‌లో ఉన్నానని చెప్పాడని.. అక్కడకు వచ్చి తనను కలవాలని కోరాడని మహిళ చెబుతోంది. అక్కడికి చేరుకున్న తనపై మద్యం మత్తులో ఉన్న మనోజ్.. తన స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ చేశాడని ఆరోపిస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మనోజ్‌తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వెంకటయ్య తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us