Hyderabad:హైదరాబాదీలకు అలెర్ట్‌.. ఆదివారం సైక్లింగ్‌ మారథాన్‌.. ఆ మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు

|

Sep 24, 2022 | 11:20 AM

Hyderabad: ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా గ్యాథరింగ్‌ సైక్లింగ్‌ కమ్యూనిటీ మారథాన్‌కు అన్ని ఏర్పాట్లుపూర్తయ్యాయి. ఆదివారం (సెప్టెంబర్‌25) ఈ మారథాన్ జరగనుంది. ఈసారి సుమారు 1000 మంది సైక్లిస్టులు ఈ రేస్‌లో పాల్గొంటారని నిర్వాహకులు చెబుతున్నారు.

Hyderabad:హైదరాబాదీలకు అలెర్ట్‌.. ఆదివారం సైక్లింగ్‌ మారథాన్‌.. ఆ మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు
Cycling Marathon
Follow us on

Traffic Restrictions: ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా గ్యాథరింగ్‌ సైక్లింగ్‌ కమ్యూనిటీ మారథాన్‌కు అన్ని ఏర్పాట్లుపూర్తయ్యాయి. ఆదివారం (సెప్టెంబర్‌25) ఈ మారథాన్ జరగనుంది. ఈసారి సుమారు 1000 మంది సైక్లిస్టులు ఈ రేస్‌లో పాల్గొంటారని నిర్వాహకులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో సైబరాబాద్‌ పరిధిలో ఆదివారం ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఐటీసీ కోహినూర్‌, ఐకియా, రోట‌రీ, కేబుల్ బ్రిడ్జి, ఎన్‌సీబీ జంక్షన్‌, గ‌చ్చిబౌలి రోడ్డు నెంబ‌ర్ 45, దుర్గం చెరువు, జూబ్లిహిల్స్ ఇనార్బిట్‌మాల్, సీవోడీ జంక్షన్‌ త‌దిత‌ర ప్రాంతాల మీదుగా సైక్లింగ్ మార‌థాన్ జ‌రుగుతుంద‌ని, ఈ సమయంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని డీసీసీ తెలిపారు.

కాగా 8 గంటల వరకే ఈ ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని ఆ తర్వాత సాధరణ రాకపోకలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కాగా ప్రతి ఏడాది గ్యాథ‌రింగ్ సైక్లింగ్ క‌మ్యూనిటీ సంస్థ సైక్లింగ్ మార‌థాన్ ను నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా ఈ రేస్‌ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఏడాదికేడాది ఈ పోటీలో పాల్గొనే సైక్లిస్టుల సంఖ్య పెరుగుతుందని, ఈసారి ఏకంగా 1000 మంది సైక్లిస్టులు రేసులో పాల్గొననున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..