T-24 Ticket Price Hike: గ్రేటర్ హైదరాబాద్‌లో టీ-24 టిక్కెట్ల ధర పెంపు.. ఎంత పెంచిందో తెలుసా..

Hyderabad city bus: గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు షాక్ ఇచ్చింది టీఎస్ ఆర్టీసీ. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో తిరిగే సిటీ బస్సుల్లో 24 గంటలపాటు ప్రయాణించడానికి వెసులుబాటు కల్పించే టీ-24 టికెట్‌ ప్రస్తుత ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ. సాధారణ ప్రయాణికులకు ఇంతకాలం ఈ టికెట్‌ ధర రూ.90 ఉండేది. అదే రూ.90 ధరను రూ.100కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

T-24 Ticket Price Hike: గ్రేటర్ హైదరాబాద్‌లో టీ-24 టిక్కెట్ల ధర పెంపు.. ఎంత పెంచిందో తెలుసా..
Hyderabad City Bus

Updated on: Jun 14, 2023 | 12:41 PM

హైదరాబాద్, జూన్ 14: ప్రయాణికులకు చేరువయ్యేందుకు తీసుకొచ్చిన టీ 24 టికెట్ ధరను పెంచింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని సిటీ బస్సుల్లో 24 గంటలపాటు ప్రయాణించడానికి వెసులుబాటు కల్పించే టీ-24 టికెట్‌ ప్రస్తుత ధరల్ని పెంచింది. సిటీ బస్సులో ప్రయాణించే సామన్యులకు ఆర్టీసీ నిర్ణయం కొంత షాకింగ్ అని చెప్పాలి. సాధారణ ప్రయాణికులకు ఈ టికెట్‌ ధరను రూ.90 నుంచి రూ.100కి పెంచేసింది. ఇదిలావుంటే, సీనియర్‌ సిటిజన్ల(పురుషులు, మహిళలు, 12 ఏళ్లపైబడిన బాలికలు)కు రూ.80 ఉండగా సాధారణ ప్రయాణికులకు రూ.90గా నిర్ణయించింది. ఈ ధరలు జూన్‌ 16 నుంచి జులై 31 వరకు అమల్లో ఉంటాయని తాజా ఉత్తర్వుల్లో తెలిసింది.

గతంలో టీ-24 టికెట్‌ ధర సాధారణ ప్రయాణికులకు రూ.100 ఉండగా.. ఏప్రిల్‌ 26న రూ.90కి తగ్గించడంతో అంతా సంబరపడిపోయారు. పర్యటకులు కూడా ఈ ధరలతో సిటీ మొత్తం తిరిగేశారు. సీనియర్‌ సిటిజన్లకు రూ.80కి అందించింది. తాజాగా పాత ధరల్ని మరోసారి తీసుకొచ్చింది.

ఇదిలావుంటే, ఓ స్వీట్ న్యూస్ చెప్పింది. ఆర్డినరీ బస్సుల్లో కూడా వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్‌(వీటీఎస్)ను తీసుకువస్తోందుకు ముమ్మర ఏర్పట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మనం ప్రయాణించాల్సిన బస్సు ఏ సమయంలో ఎక్కడికి వస్తుందో తెలిపేందుకు వీటీఎస్ పనికి వస్తుంది.

ఏ సమయానికి వస్తుందనే విషయాన్ని ప్రయాణికులు సులువుగా తెలుసుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా తిరిగే 900 మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో దీనిని ప్రవేశపెట్టారు. ఇప్పుడు అన్ని సిటీ ఆర్డినరీ బస్సుల్లో కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Loading...
Unable to load recommendations.
Follow Us