Special Trains: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. మరిన్ని ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే శాఖ.. రూట్, తేదీ వివరాలు

|

Aug 12, 2022 | 4:30 PM

Special Trains: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ - తిరుపతి మధ్య మరో నాలుగు సర్వీసుల ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ఓ ప్రకటనలో తెలిపింది.

Special Trains: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. మరిన్ని ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే శాఖ.. రూట్, తేదీ వివరాలు
Tirupati Railway Station
Follow us on

Railway Passenger Alert: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ మరో తీపి కబురు అందించింది. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ – తిరుపతి (Secunderabad – Tirupati) మధ్య మరో నాలుగు సర్వీసుల ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ఓ ప్రకటనలో తెలిపింది.  ఆగస్టు 15న సాయంత్రం 06.20 గం.లకు ప్రత్యేక రైలు (నెం.07411) సికింద్రాబాద్ నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.30 గం.లకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకోనుంది. అలాగే ఆగస్టు 16న సాయంత్రం 05.15 గం.లకు ప్రత్యేక రైలు (నెం.07412) తిరుపతి నుండి బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 06.25 గం.లకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు రెండు మార్గాల్లోనూ లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, సేరం, కృష్ణ, రాయ్‌చూర్, మంత్రాలయం రోడ్, ఆధోని, గుంతకల్, తాడిపత్రి, యెర్రగుంట్ల, కడప, రాజంపేట్, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి.

అలాగే సికింద్రాబాద్ – తిరుపతి మధ్య విజయవాడ మీదుగా రెండు సర్వీసుల ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు ద.మ.రైల్వే ప్రకటించింది. ఆగస్టు 17వ తేదీన సాయంత్రం 06.40 గం.లకు ప్రత్యేక రైలు (07473) సికింద్రాబాద్ నుండి బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 06.45 గం.లకు తిరుపతికి చేరుకుంటుంది. ఎదురు దిశలో ఆగస్టు 18వ తేదీన సాయంత్రం 05.00 గం.లకు ప్రత్యేక రైలు (నెం.07474) తిరుపతి నుండి బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 05.45 గం.లకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. రెండు మార్గాల్లోనూ ఈ ప్రత్యేక రైళ్లు జనగామ, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగతాయి.

ఇవి కూడా చదవండి

Special Trains between Secunderabad – Tirupati

ఈ ప్రత్యేక రైళ్లలో జనరల్ సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్, ఏసీ 3 టైర్, ఏసీ 2 టైర్ కోచ్‌లు ఉంటాయని ద.మ.రైల్వే అధికారులు శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.

నర్సాపూర్- సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు..

అలాగే నర్సాపూర్ – సికింద్రాబాద్ మధ్య మూడు సర్వీసుల ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ప్రకటించింది. ఆగస్టు 13, 15 తేదీల్లో ప్రత్యేక రైలు నెం.07466 సాయంత్రం 06.00 గం.లకు నర్సాపూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు వేకువజామున 04.10 గం.లకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఆగస్టు 14న ప్రత్యేక రైలు నెం.07467 రాత్రి 09.05 గం.లకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.35 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లో ఉంటాయని రైల్వే శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి