వైభవంగా శ్రీరాముని శోభాయాత్ర

| Edited By:

Apr 14, 2019 | 5:44 PM

హైదరాబాద్ : శ్రీరామనవమి సందర్భంగా సీతారామ్‌ బాగ్‌, రాణి అవంతీబాయ్‌ ఆలయం నుంచి శ్రీ సీతారాముల శోభయాత్ర కొనసాగుతోంది. ఈ శోభాయాత్రలో భారీ హనుమాన్ విగ్రహాలు, శ్రీ రాముని విగ్రహాలు తరలివెళ్తున్నాయి. గౌలిగూడలోని హనుమాన్ వ్యాయామశాల వరకు సాగతున్న ఈ శోభయాత్రలో శ్రీరామ ఉత్సవ సమితి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, భజరంగ్‌దళ్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పురాన్‌పూల్, గౌలీగూడ, సుల్తాన్ బజార్ మీదుగా సాగుతున్న ఈ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా […]

వైభవంగా శ్రీరాముని శోభాయాత్ర
Follow us on

హైదరాబాద్ : శ్రీరామనవమి సందర్భంగా సీతారామ్‌ బాగ్‌, రాణి అవంతీబాయ్‌ ఆలయం నుంచి శ్రీ సీతారాముల శోభయాత్ర కొనసాగుతోంది. ఈ శోభాయాత్రలో భారీ హనుమాన్ విగ్రహాలు, శ్రీ రాముని విగ్రహాలు తరలివెళ్తున్నాయి. గౌలిగూడలోని హనుమాన్ వ్యాయామశాల వరకు సాగతున్న ఈ శోభయాత్రలో శ్రీరామ ఉత్సవ సమితి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, భజరంగ్‌దళ్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పురాన్‌పూల్, గౌలీగూడ, సుల్తాన్ బజార్ మీదుగా సాగుతున్న ఈ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను వినియోగిస్తున్నారు. సుమారు ఐదువేల మంది పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారు.