Bomb Hoax: రైలులో బాంబు.. ఆకతాయిని పట్టుకున్న పోలీసులు.. యువకుడి సమధానంతో పోలీసులకు షాక్

రైల్లో బాంబు(Bomb in Train) ఉందని కాల్ చేసిన ఆకతాయిని పోలీసులు పట్టుకున్నారు. బహదూర్ పల్లికి చెందిన తొర్రి కార్తిక్ అనే యువకుడు ఫేక్ కాల్ చేసినట్లు గుర్తించారు. రైలులో బాంబు ఉందని కాల్ చేస్తే పోలీసులు ఏ విధంగా....

Bomb Hoax: రైలులో బాంబు.. ఆకతాయిని పట్టుకున్న పోలీసులు.. యువకుడి సమధానంతో పోలీసులకు షాక్
Bomb In Train

Updated on: Apr 14, 2022 | 7:16 AM

రైల్లో బాంబు(Bomb in Train) ఉందని కాల్ చేసిన ఆకతాయిని పోలీసులు పట్టుకున్నారు. బహదూర్ పల్లికి చెందిన తొర్రి కార్తిక్ అనే యువకుడు ఫేక్ కాల్ చేసినట్లు గుర్తించారు. రైలులో బాంబు ఉందని కాల్ చేస్తే పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో చూద్దామని కాల్ చేసినట్లు ఆ యువకుడు చెప్పడంతో పోలీసులు విస్మయానికి గురయ్యారు. రైలులో బాంబు ఉందంటూ డయిల్‌ 100కు బుధవారం ఓ ఆకతాయి ఫోన్ చేశాడు. విశాఖపట్నం(Visakhapatnam) నుంచి సికింద్రాబాద్‌కు(Secunderabad) వస్తున్న రైల్లో బాంబు పెట్టినట్లు చెప్పాడు. దీంతో రైల్వేతో పాటు స్థానిక పోలీసులను అధికారులు అప్రమత్తం చేశారు. అప్పటికే ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ కాజీపేటలో ఉండటంతో అక్కడే నిలిపి తనిఖీలు చేపట్టారు. కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ చర్లపల్లి స్టేషన్‌కు చేరుకోగా అక్కడ తనిఖీలు చేశారు. బాంబు ఆనవాళ్లు లభ్యం కాకపోవడంతో ఆకతాయి ఫోన్‌ కాల్‌ గా గుర్తించి ఊపిరి పీల్చుకున్నారు.

రైళ్లు వేర్వేరు సమయాల్లో సికింద్రాబాద్‌ స్టేషన్ కు చేరుకున్నప్పటికీ.. స్థానిక పోలీసులతో కలిసి జీఆర్పీ, ఆర్పీఎఫ్‌, బాంబుస్వ్కాడ్‌, డాగ్‌స్వ్కాడ్‌ బృందాలు రైళ్లు, రైల్వేస్టేషన్‌లోని ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేశాయి. రైలులో బాంబు పెట్టామని ఫోన్‌ చేసిన ఆకతాయిని పేట్‌బషీరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఒడిశాలో ఇలాంటి ఘటన జరిగిన నేపథ్యంలో నిందితుడు కార్తీక్‌ ఆకతాయిగా డయిల్‌ 100కు ఫోన్‌ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.

Also Read

Horoscope Today: వీరు దైవ దర్శనాలు చేసుకుంటారు.. ఆకస్మిక ధననష్టం ఉంటుంది.. గురువారం రాశిఫలాలు..

Big Bazaar Cheating: ఆఫర్ల పేరుతో ‘బిగ్’ చీటింగ్.. మ్యాటర్ తెలిసి బోరుమంటున్న బాధితులు..!

Sonu Sood: నా భార్య రక్తం తాగుతోందని నెటిజన్‌ ట్వీట్‌.. సోనూ సూద్ ఏం సమాధానం ఇచ్చాడో తెలుసా?