Komatireddy Venkat Reddy: 11 అయినా ఖాళీ కుర్చీలున్నాయేంటి..? మంత్రి కోమటిరెడ్డి వార్నింగ్ చూశారా..? వీడియో

|

Jul 03, 2024 | 1:55 PM

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్‌ అండ్‌ బీ సెక్షన్‌లో తనిఖీలు చేశారు. సెక్రటేరియట్‌లో ఉద్యోగుల పనితీరు గురించి తెలుసుకోడానికి వెళ్లిన మంత్రి.. అక్కడ పరిస్థితి చూసి నిర్ఘాంతపోయారు. ఆర్‌ అండ్‌ బీ సెక్షన్‌లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఆయనకు.. ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్‌ అండ్‌ బీ సెక్షన్‌లో తనిఖీలు చేశారు. సెక్రటేరియట్‌లో ఉద్యోగుల పనితీరు గురించి తెలుసుకోడానికి వెళ్లిన మంత్రి.. అక్కడ పరిస్థితి చూసి నిర్ఘాంతపోయారు. ఆర్‌ అండ్‌ బీ సెక్షన్‌లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఆయనకు.. ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. సమయం దాటిపోయినా చాలా మంది ఉద్యోగులు ఆఫీసుకు రాకపోవడంతో మంత్రి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా ఉద్యోగులు ఉదయం 10 గంటలకు కార్యాలయాలకు హాజరు కావాల్సి ఉంటుంది. కానీ, సెక్రటేరియట్ ఉద్యోగులు మాత్రం 11 గంటలైనా రాకపోవడంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు.

11 అయినా రాలేదు.. మళ్లీ 6గంటలకు వెళ్లిపోతారు.. మధ్యలో ఆఫ్ అంటూ మంత్రి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతోపాటు పలు వివరాలను మంత్రి కోమటిరెడ్డి అడిగి తెలుసుకున్నారు.. కొన్ని విషయాలపై అధికారులు స్పందించకపోవడంతో మీ వివరాలు మీకు కూడా తెలియదా అంటూ ఫైర్ అయ్యారు. ఇకపై ఉద్యోగులు సమయపాలన పాటించాలని.. ఇలా అయితే కుదరదంటూ వార్నింగ్ ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..