ఆరోగ్యానికి అడుగులు… ఐక్యతకు బాటగా హెరిటేజ్ రన్.. మీరు పాల్గొనండి..! ఎప్పుడంటే..

తెలంగాణ ప్రభుత్వం, రాపిడో సంయుక్తంగా ఫిబ్రవరి 22, 2026న హైదరాబాద్ హెరిటేజ్ రన్‌ను నిర్వహిస్తున్నాయి. నగర వారసత్వాన్ని చాటిచెప్పడం, ఆరోగ్యం, ఐక్యతను ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. చారిత్రక ప్రాంతాల గుండా సాగే ఈ పరుగు నగర సంస్కృతిని అనుభవించే అద్భుత అవకాశం కల్పిస్తుంది. 5000 మందికి పైగా పాల్గొంటారని అంచనా. రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.

ఆరోగ్యానికి అడుగులు… ఐక్యతకు బాటగా హెరిటేజ్ రన్.. మీరు పాల్గొనండి..! ఎప్పుడంటే..
Hyderabad Heritage Run 2026

Edited By:

Updated on: Feb 05, 2026 | 12:23 PM

హైదరాబాద్ నగరంలోని అపూర్వమైన సాంస్కృతిక వారసత్వాన్ని గర్వంగా జరుపుకునే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం నగరవ్యాప్త రాపిడో హైదరాబాద్ హెరిటేజ్ రన్ నిర్వహణ కు సిద్ధమైంది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ పర్యాటక శాఖ మరియు భారతదేశంలోని ప్రముఖ మొబిలిటీ ప్లాట్‌ఫాం రాపిడో సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ హెరిటేజ్ రన్ 22 ఫిబ్రవరి 2026న జరగనుండగా, రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం ప్రారంభమై 15 ఫిబ్రవరి 2026 వరకు కొనసాగనున్నాయనీ నిర్వాహకులు తెలిపారు.

హెరిటేజ్ రన్ ద్వారా పౌరులు, ఫిట్‌నెస్ అభిమాని వర్గాలు, ప్రముఖ సంస్థ అధిపతులు, సందర్శకులు ఒకే వేదికపైకి వచ్చి హైదరాబాద్‌ను ఒక వారసత్వ నగరంగా అనుభవించే అవకాశం కలుగుతుంది. చరిత్ర, సంస్కృతి, సమాజం రోజువారీ నగర జీవితంలో సహజంగా కలిసిపోతున్న నగరమే హైదరాబాద్. సాంస్కృతికంగా ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల గుండా రూపొందించిన మార్గాల్లో ఈ పరుగు సాగుతూ, పాల్గొనేవారి కదలిక, పాల్గొనడం ద్వారా నగర వారసత్వంతో మరింత దగ్గరగా మమేకమయ్యేలా ప్రోత్సహిస్తుంది.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం,  కల్చర్ మరియు క్రీడా విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ గారు మాట్లాడుతూ, “హైదరాబాద్ హెరిటేజ్ రన్ ప్రజా పాల్గొనడం, ఫిట్‌నెస్, సాంస్కృతిక అవగాహన ఎలా సమన్వయంగా కలిసిపోవచ్చో చూపించే అద్భుతమైన ఉదాహరణ. హైదరాబాద్ వారసత్వం కేవలం స్మారకాలకు మాత్రమే పరిమితం కాదు; అది వీధుల్లో, ప్రాంతాల్లో, ముఖ్యంగా ప్రజల్లో జీవించి ఉంటుంది. ఈ పరుగు పౌరులకు నగరంతో మళ్లీ ముడిపడే అవకాశాన్ని కల్పించడమే కాకుండా, ఆరోగ్యకరమైన మరియు చురుకైన జీవనశైలిని కూడా ప్రోత్సహిస్తుంది” అని అన్నారు.

ఇవి కూడా చదవండి

టీజీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు పర్యాటక శాఖ డైరెక్టర్ శ్రీమతి వల్లూరి క్రాంతి, ఐఏఎస్, మాట్లాడుతూ,
“రాపిడోతో కలిసి చేపట్టిన ఈ సంయుక్త కార్యక్రమం హైదరాబాద్ యొక్క శాశ్వత వారసత్వాన్ని వెలుగులోకి తీసుకువస్తూ, ఈ విభిన్న సమాజాల్లో ఆరోగ్యం మరియు ఐక్యతను మరింత బలోపేతం చేస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ చారిత్రక హెరిటేజ్ రన్‌లో పాల్గొనాలని మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాము” అని తెలిపారు.

రాపిడో కో-ఫౌండర్ శ్రీ పవన్ గుంటుపల్లి గారు మాట్లాడుతూ, “రాపిడోకు హైదరాబాద్ ఒక ప్రత్యేకమైన స్థానం కలిగిన నగరం. హైదరాబాద్ హెరిటేజ్ రన్‌కు మద్దతు ఇవ్వడం మా సంస్థ నమ్మకానికి అనుగుణంగా ఉంది – మొబిలిటీ ప్రజలను మరియు వారు నివసించే నగరాలను మరింత దగ్గరగా అనుసంధానించగలదనే విశ్వాసం మాకు ఉంది. తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యంగా హైదరాబాద్ వారసత్వాన్ని ఘనంగా జరుపుకుంటూ, సమాజ భాగస్వామ్యాన్ని పెద్ద స్థాయిలో ప్రోత్సహించడంలో మేము పాల్గొనడం మాకు గర్వ కారణం” అని అన్నారు. ఈ హెరిటేజ్ రన్‌లో వివిధ వయస్సులు, నేపథ్యాల నుండి 5,000 మందికి పైగా రన్నర్లు పాల్గొననున్నారు. ఇప్పుడే నమోదు చేసుకోవలనీ నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Loading...
Unable to load recommendations.
Follow Us