
హైదరాబాద్లోని మైనార్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. వారికి మెరుగైన విద్యను అందించే లక్ష్యంతో నగరంలోనిపలు ప్రాంతాల్లో అత్యాధుని వసతులతో స్కూల్, కాలేజీ, హాస్టల్స్ను ఏర్పాటు చేసింది. వీటిని త్వరలోనే విద్యార్థులకు అందుబాటులోకి తేనుంది. మైనార్టీ వర్గాల సామాజిక, విద్యా రంగాల అభివృద్ధికి, ముఖ్యంగా బాలికల ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వ నిధులతో నగరంలోని వివిధ కీలక ప్రాంతాలలో విద్యా సంస్థలు,హాస్టల్స్ నూతన భవనాలు నిర్మించారు.
సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో ముందుకు సాగుతున్న మోదీ ప్రభుత్వం, మైనార్టీ విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఈ మౌలిక వసతులను కల్పించింది. ముఖ్యంగా నాంపల్లి, బజార్ఘాట్ వంటి మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో బాలికల విద్యా సంస్థలు, హాస్టళ్లను ఏర్పాటు చేయడం ద్వారా ముస్లిం, ఇతర మైనార్టీ విద్యార్థినుల డ్రాపౌట్ రేటు గణనీయంగా తగ్గుతుందని, వారి ఉన్నత చదువులకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతుంది విద్యాశాఖ,కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది
నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న స్కూల్, కాలేజ్, హాస్టల్స్ ఇవే
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.