ట్రాఫిక్ చలాన్ల తరహాలో జీహెచ్ఎంసీ చలాన్లను త్వరలోనే.. పూర్తిస్థాయిలో అమలు చేస్తామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. రోడ్లపై చెత్త వేసినా, ఫ్లెక్సీలు పెట్టినా, బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేసినా, వాల్ పోస్టర్లు అంటించినా వాటిని ఫోటోలు తీసి జరిమానాలు విధిస్తామన్నారు. హైదరాబాద్ నగర సుందరీకరణకు విఘాతం కలిగించే అంశాలపై జీహెచ్ ఎంసీ కఠినంగా వ్యవహరించనుంది.
ఈ తరహాలో ఒక్క నెలలోనే ఇప్పటి వరకు 1085 నోటీసులు పంపి రూ.1.50 కోట్ల మేర జరిమానాలు విధించినట్లు మేయర్ బొంతు రామ్మెహన్ తెలిపారు. చలాన్ వేసిన 24 గంటల్లోగా చెత్తను తీసివేయకుంటే జరిమానా మరింత పెరుగుతుందన్నారు. వచ్చే శనివారం నుండి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఆన్లైన్ ద్వారా జరిమానా విధిస్తామన్నారు.
జరిమానాలు: