
Cyber Crime: సైబర్ నేరగాళ్లు నకిలీ నెంబర్లు, డీపీలతో అటు మొబైల్ నంబర్లతోనే కాదు, సోషల్ మీడియాలో ప్రజలను మోసం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మోసంలో తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చిక్కుకున్నారు. ఈ మేరకు స్పందించిన ఆయన, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ మేరకు మాట్లాడిన ఆయన, తన పేరిట వచ్చే వాట్సాప్ మెసేజ్లపై ఉద్యోగులు, అధికారులు, కార్యకర్తలు, అభిమానులతో ఎవరూ స్పందించొద్దని కోరారు. ఎక్కువగా 9353849489 నంబర్ నుంచే మెసేజ్లు వస్తున్నాయని, అలాంటి ఫ్రాడ్ మెసేజ్లకు స్పందించవద్దని సూచించారు.
ఆ నంబర్కు డబ్బులెవరూ పంపొద్దని కోరారు. ఇలాంటి నేరగాళ్లపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..