తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్కు చేరుకున్నారు. గత రెండు వారాలుగా ఫామ్ హౌస్లో ఉన్న సీఎం.. తాజాగా ప్రగతి భవన్కి వచ్చారు. ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులపై, కరోనా పరిస్థితులపై ఆయన అధికారులతో చర్చించనున్నారు. అలాగే ఒకటి, రెండు రోజుల్లో రైతులతో సీఎం సమావేశమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.