పబ్‌లో యువకులపై బౌన్సర్ల దాడి..!

| Edited By:

Jun 17, 2019 | 9:52 AM

హైదరాబాద్ ఓ పబ్‌లో బౌన్సర్లు రెచ్చిపోయారు. జూబ్లిహిల్స్‌లోని అమ్నిషియాలాంజ్ పబ్‌లో తొమ్మిదిమంది యువకులపై బౌన్సర్లు దాడి చేశారు. ఈ దాడిలో కార్తిక్ రెడ్డి, చంద్రకిరణ్ రెడ్డి, నవీన్, శరత్ చంద్ర, తీవ్రంగా గాయపడ్డారు. దీంతో బాధితులు జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. స్నేహితుడి బర్త్‌డే సందర్భంగా యువకులంతా అమ్నీషియాలాంజ్ పబ్‌కు వెళ్లారు. వీరిలో ఓ యువకుడు వాష్‌‌రూమ్‌లో టిష్యూ పేపర్ బాక్స్ కింద పడేయడంతో వివాదం మొదలైంది. బౌన్సర్లంతా కలిసి తొమ్మిది మంది యువకులపై దాడి చేసి, […]

పబ్‌లో యువకులపై బౌన్సర్ల దాడి..!
Follow us on

హైదరాబాద్ ఓ పబ్‌లో బౌన్సర్లు రెచ్చిపోయారు. జూబ్లిహిల్స్‌లోని అమ్నిషియాలాంజ్ పబ్‌లో తొమ్మిదిమంది యువకులపై బౌన్సర్లు దాడి చేశారు. ఈ దాడిలో కార్తిక్ రెడ్డి, చంద్రకిరణ్ రెడ్డి, నవీన్, శరత్ చంద్ర, తీవ్రంగా గాయపడ్డారు. దీంతో బాధితులు జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

స్నేహితుడి బర్త్‌డే సందర్భంగా యువకులంతా అమ్నీషియాలాంజ్ పబ్‌కు వెళ్లారు. వీరిలో ఓ యువకుడు వాష్‌‌రూమ్‌లో టిష్యూ పేపర్ బాక్స్ కింద పడేయడంతో వివాదం మొదలైంది. బౌన్సర్లంతా కలిసి తొమ్మిది మంది యువకులపై దాడి చేసి, అసభ్య పదాజాలంతో తిట్టారు.

యువకులందర్నీ బయటకు లాగి విచక్షణారహితంగా కొట్టారు బౌన్సర్లు. యువకులు కిందపడిపోయినా పట్టించుకోకుండా దాడి చేశారు. గాయపడిన యువకులు జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.