Telangana: స్నేహితుడి భార్యతో వెళ్లిపోయిన వ్యాపారి.. ఇంట్లో దొరికిన లేఖలోనే అసలు ట్విస్ట్..

|

Jun 02, 2023 | 9:40 AM

Telangana: దైవదర్శనం కోసం వెళ్తున్నానని భార్యకు చెప్పి ఓ వ్యాపారి స్నేహితుడి భార్యతో మాయమయ్యాడు. వెళ్లిన మరుసటి రోజే భర్త ఫోన్ స్విచ్ఛాప్ రావడంతో అందోళన చెందిన సదరు వ్యాపారి భార్య మారేడుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకెళ్తే.. న్యూబోయినపల్లికి చెందిన అతుల్ అనే వ్యాపారి

Telangana: స్నేహితుడి భార్యతో వెళ్లిపోయిన వ్యాపారి.. ఇంట్లో దొరికిన లేఖలోనే అసలు ట్విస్ట్..
Man Eloped With Friend's Wife
Follow us on

Telangana: దైవదర్శనం కోసం వెళ్తున్నానని భార్యకు చెప్పి ఓ వ్యాపారి స్నేహితుడి భార్యతో మాయమయ్యాడు. వెళ్లిన మరుసటి రోజే భర్త ఫోన్ స్విచ్ఛాప్ రావడంతో అందోళన చెందిన సదరు వ్యాపారి భార్య మారేడుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకెళ్తే.. న్యూబోయినపల్లికి చెందిన అతుల్(45) అనే వ్యాపారి మే 29న శిర్డీ వెళ్లాడు. ఆ మరుసటి రోజు అతుల్ భార్య అతనికి కాల్ చేయగా.. ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. ఆ క్రమంలోనే తన కోసం అతుల్ రాసిన లేఖ ఆమెకు దొరికింది.

అందులోనే అసలు విషయం దాగి ఉంది. తన స్నేహితుడి భార్యతో కలిసి ఉండడానికి వెళ్తిపోతున్నానని, ఆ విషయం తన స్నేహితుడికి కూడా తెలుసని, తమ కోసం వెతకవద్దని అతుల్ ఆ లేఖలో రాశాడు. కాగా, ఇంట్లో నుంచి అతుల్ వెళ్తూ రూ.10 లక్షల నగదు తీసుకెళ్లాడని అతని భార్య తన ఫిర్యాదులో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం  క్లిక్ చేయండి..