Telangana: స్నేహితుడి భార్యతో వెళ్లిపోయిన వ్యాపారి.. ఇంట్లో దొరికిన లేఖలోనే అసలు ట్విస్ట్..

Telangana: దైవదర్శనం కోసం వెళ్తున్నానని భార్యకు చెప్పి ఓ వ్యాపారి స్నేహితుడి భార్యతో మాయమయ్యాడు. వెళ్లిన మరుసటి రోజే భర్త ఫోన్ స్విచ్ఛాప్ రావడంతో అందోళన చెందిన సదరు వ్యాపారి భార్య మారేడుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకెళ్తే.. న్యూబోయినపల్లికి చెందిన అతుల్ అనే వ్యాపారి

Telangana: స్నేహితుడి భార్యతో వెళ్లిపోయిన వ్యాపారి.. ఇంట్లో దొరికిన లేఖలోనే అసలు ట్విస్ట్..
Man Eloped With Friend's Wife

Updated on: Jun 02, 2023 | 9:40 AM

Telangana: దైవదర్శనం కోసం వెళ్తున్నానని భార్యకు చెప్పి ఓ వ్యాపారి స్నేహితుడి భార్యతో మాయమయ్యాడు. వెళ్లిన మరుసటి రోజే భర్త ఫోన్ స్విచ్ఛాప్ రావడంతో అందోళన చెందిన సదరు వ్యాపారి భార్య మారేడుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకెళ్తే.. న్యూబోయినపల్లికి చెందిన అతుల్(45) అనే వ్యాపారి మే 29న శిర్డీ వెళ్లాడు. ఆ మరుసటి రోజు అతుల్ భార్య అతనికి కాల్ చేయగా.. ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. ఆ క్రమంలోనే తన కోసం అతుల్ రాసిన లేఖ ఆమెకు దొరికింది.

అందులోనే అసలు విషయం దాగి ఉంది. తన స్నేహితుడి భార్యతో కలిసి ఉండడానికి వెళ్తిపోతున్నానని, ఆ విషయం తన స్నేహితుడికి కూడా తెలుసని, తమ కోసం వెతకవద్దని అతుల్ ఆ లేఖలో రాశాడు. కాగా, ఇంట్లో నుంచి అతుల్ వెళ్తూ రూ.10 లక్షల నగదు తీసుకెళ్లాడని అతని భార్య తన ఫిర్యాదులో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం  క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us