Telangana: సోయా పంట పొలంలో అలకిడి.. కనిపించిన సీన్ చూసి పరుగో పరుగు..!

|

Sep 15, 2024 | 4:02 PM

సోయా పంట పొలంలో ఆదివారం కొండచిలువ కలకలం రేపింది. వ్యవసాయ పనులు చేస్తున్న లక్ష్మణ్ పోతన్న పొలాల్లో భారీ కొండ చిలువ కనిపించింది.

Telangana: సోయా పంట పొలంలో అలకిడి.. కనిపించిన సీన్ చూసి పరుగో పరుగు..!
A Huge Python
Follow us on

నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని సింగన్ గావ్ గ్రామ శివారులోని సోయా పంట పొలంలో ఆదివారం కొండచిలువ కలకలం రేపింది. వ్యవసాయ పనులు చేస్తున్న లక్ష్మణ్ పోతన్న పొలాల్లో భారీ కొండ చిలువ కనిపించింది. ఈ అతి పెద్ద కొండచిలువను చూసిన రైతులు భయంతో పరుగులు తీశారు. ఆ వెంటనే గ్రామస్తులు తానూర్ గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ షహబాజ్ అనే యువకుడికి సమాచారం అందించారు. దీంతో అతను ఘటనా స్థలానికి చేరుకుని గంట పాటు శ్రమించి కొండచిలువను సురక్షితంగా పట్టుకున్నాడు. ఈ సంఘటన గ్రామస్తుల్లో ఉత్కంఠను రేకెత్తించింది. కాని షహబాజ్ చాకచక్యం వ్యవహరించి పామును పట్టుకున్నారు. అనంతరం కొండచిలువను అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలివేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో చూడండి..

విశాఖలో 12 అడుగుల కొండచిలువ

విశాఖలో 12 అడుగుల కొండచిలువ కలకలం సృష్టించింది. జీవీఎంసీ జోన్‌`2, 9వ వార్డు ఎండాడ`ఆదర్శనగర్‌ ప్రాంతంలో ఓ పంప్‌ హౌస్‌ ఉంది. పంప్‌ హౌస్‌ నుంచి నీటిని విడుదల చేసేందుకు అక్కడి ఇన్‌స్పెక్టర్‌ నరేష్‌ సిద్ధమయ్యాడు. వాల్ దగ్గరకి దిగాడు.. అక్కడ 12 అడుగుల కొండచిలువ కనిపించడంతో బెంబేలెత్తిపోయాడు. ఆ తర్వాత పరుగులు పెట్టాడు. తేరుకునేలోపే కంగారుతో కిందపడ్డాడు. అక్కడే ఉన్న సిబ్బంది అప్రమత్తమై విషయాన్ని తెలుసుకున్నారు. నరేష్‌ను పైకి లేపి.. కొండచిలువ సమాచారాన్ని పాములు పట్టే స్నేక్‌ కేచర్‌ కిరణ్‌కు సమాచారమిచ్చారు. కిరణ్‌ అక్కడకు చేరుకుని పామును అత్యంత చాకచక్యంగా పట్టుకున్నాడు. ఒకానొక సమయంలో కిరణ్ ను కూడా శరీరమంతా చుట్టేసింది ఆ కొండచిలువ. అది కష్టం మీద కొండచిలువను అదుపులోకి తీసుకొని పైకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆ కొండచిలువను అడవిలో వదిలేశాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..