ఏయ్.. అలా ఎలా పట్టేశావ్.. రోడ్డుపై ప్రత్యక్షమైన భారీ పైథాన్.. ఆ తర్వాత జరిగిందిదే..
ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ.. భారీ సైజ్లో ఉన్న కొండ చిలువ జనావాసల్లో హల్చల్ చేసింది. దీంతో అందరూ పరుగులు తీశారు. చివరకు స్నాక్ క్యాచర్ దానిని పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని రాజ పల్లి గ్రామం వద్ద భారీ కొండ చిలువ ప్రత్యక్షమైంది.

ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ.. భారీ సైజ్లో ఉన్న కొండ చిలువ జనావాసల్లో హల్చల్ చేసింది. దీంతో అందరూ పరుగులు తీశారు. చివరకు స్నాక్ క్యాచర్ దానిని పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని రాజ పల్లి గ్రామం వద్ద భారీ కొండ చిలువ ప్రత్యక్షమైంది. దీంతో భయభ్రాంతులైన స్థానికులు పరుగులు తీశారు. అక్కడి నుంచి పంపేందుకు ప్రయత్నం చేశారు. కానీ.. భారీ సైజ్ లో ఉండటంతో పంపడం సాధ్యం కాలేకపోయింది. తరువాత.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్నాక్ క్యాచ్ సహకారంతో దానిని చాకచక్యంగా పట్టుకున్నారు.
ఇంత పెద్ద భారీ కొండచిలువ ప్రజలు నివసించే ప్రాంతానికి రావడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు.. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ కొండచిలువ గురించి ఫారెస్ట్ అధికారులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదని పేర్కొన్నారు. ఏదైనా ప్రమాదం జరిగినా ఇంతేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు స్పందించకపోవడంతో ఏం చేయాలో తెలియక హుజురాబాద్ అంబేద్కర్ విగ్రహం వద్ద వదిలిపెట్టారు. తరువాత అటవీ శాఖ అధికారులు..ఈ కొండ చిలువను. అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
వీడియో చూడండి..
ఇవి కూడా చదవండి
Hyderabad: వలపు వల.. గురువు విలవిల.. ఇదో పెద్ద కామ క్రైమ్ కథా చిత్రమ్..
Panipuri: అబ్బ.. పానీపూరీ తింటున్నారా..? 30 రోజులు ఆస్పత్రి పాలైన ఇంజనీర్.. ఈ కథ తెలిస్తే కళ్లు బైర్లే
Hyderabad: ఇలా తయారయ్యారేంట్రా బాబూ.. 5 గదుల్లో విద్యార్థులకు క్లాస్లు.. 6వ గదిలో భయంకరమైన రహస్యం
