Hyderabad: నువ్వు గ్రేట్‌ బ్రో.. గుడ్లగూబను దత్తత తీసుకున్న నటుడు..

|

Nov 12, 2021 | 6:43 PM

సాధారణంగా గుడ్లగూబను చూడగానే చాలామంది భయపడతారు.. అసహ్యించుకుంటారు. ముఖ్యంగా దాని కళ్లను చూడగానే వణుకు పుడుతుంది..

Hyderabad: నువ్వు గ్రేట్‌ బ్రో.. గుడ్లగూబను దత్తత తీసుకున్న నటుడు..
Follow us on

సాధారణంగా గుడ్లగూబను చూడగానే చాలామంది భయపడతారు.. అసహ్యించుకుంటారు. ముఖ్యంగా దాని కళ్లను చూడగానే వణుకు పుడుతుంది. అందుకే చాలావరకు హర్రర్‌, థ్రిల్లర్‌ సినిమాల్లో ఏదైనా భయానక సన్నివేశాలకు ముందు చెట్టుపై కూర్చున్న గుడ్లగూబనే చూపిస్తుంటారు. అదేవిధంగా ఈ పక్షిని అపశకునంగా, దురదృష్టానికి సంకేతంగా కూడా భావిస్తారు. అయితే అలాంటి పక్షిని దత్తత తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు నిర్మాత, నటుడు సూర్యతేజ్‌. శుక్రవారం హైదరాబాద్‌లోని నెహ్రూ జులాజికల్‌ పార్కును ఆయన సందర్శించాడు. అనంతరం జూపార్క్‌లోని గుడ్లగూబను ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు దీనికి సంబంధించిన రూ.20వేల చెక్‌ను జూపార్క్‌ క్యూరేటర్‌ రాజశేఖర్‌కు అందించాడు.

మరికొంతమంది ముందుకు రావాలి..
ఈ సందర్భంగా సూర్యతేజ్‌ మాట్లాడుతూ నెహ్రూ జులాజికల్‌ పార్కును సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు. తన జీవితంలో మరుపురాని విషయాల్లో ఇది కూడా ఒకటని తెలిపాడు. హైదరాబాద్‌ నగరం ఎన్నో మూగజీవాలకు నిలయంగా ఉందని, నెహ్రూ పార్క్‌ నిర్వహణ అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. అనంతరం జూపార్క్‌ క్యూరేటర్‌ రాజశేఖర్‌ మాట్లాడూతూ సూర్యతేజ లాగే మరికొంత మంది హీరోలు, సామాన్యులు జంతువులు, పక్షుల దత్తత కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ‘మూగజీవాల సంరక్షణలో భాగంగా సూర్యతేజ్‌ తీసుకున్న నిర్ణయం మరెంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. అతడిని చూసి మరికొంతమంది హీరోలు, సామాన్యులు జంతువులను దత్తత తీసుకుంటారని ఆశిస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు.

Also Read:

Hyderabad: హైదరాబాద్ రోడ్ల అభివృద్దికి స్థల సేకరణ వేగవంతం.. GHMC కీలక నిర్ణయం..

Mahesh Bank: మహేష్‌ బ్యాంక్‌ కేసులో కీలక మలుపు.. మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసిన ఈడీ

Mahesh Bank: మహేష్‌ బ్యాంక్‌ కేసులో కీలక మలుపు.. మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసిన ఈడీ