Mothkupally Narsimhulu: కేసీఆర్‌ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు

| Edited By: Anil kumar poka

Oct 18, 2021 | 5:23 PM

Mothkupally Narsimhulu: మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్..

Mothkupally Narsimhulu: కేసీఆర్‌ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు
Follow us on

Mothkupally Narsimhulu: మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్శింహులు. ఈ సోమవారం ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహానికి, బషీర్ బాగ్ లోని బాబు జగ్జివన్ రావు.. అనంతరం గన్ పార్కు లోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన తెలంగాణ భవన్ కు బయల్దేరిన ఆయన పార్టీ కండువా కప్పుకొన్నారు.

అయితే మోత్కుపల్లి నర్సింహులు కు ఓ కీలక పదవి కూడా ఇచ్చే యోచనలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుకు స్పష్టమైన హామీ వచ్చినట్లు సమాచారం.

ఇవీ కూడా చదవండి:

Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)

MP Vijayasai reddy: ఏపీ విధానాలు స్టడీ చేయమని కేరళ ప్రభుత్వం వ్యవసాయ మంత్రిని పంపింది: ఎంపీ విజయసాయిరెడ్డి

Sasikala: జయలలిత ఫార్ములా చిన్నమ్మకు వర్కౌట్ అవుతుందా..? ఏఐఏడీఎంకే లో ఎంట్రీకి చిన్నమ్మ యాక్షన్ ప్లాన్ అదేనా?