
పోలీసులు కూంబింగ్కొస్తే.. అన్నలను కడుపులో పెట్టి దాచేసుకున్నారు ఆదివాసీలు. ఒక్కోసారి పోలీస్ జీపులనే తగలబెట్టేశారు. ఖాకీ నీడ కూడా వారిపై పడనిచ్చేవారు కాదు. అన్నలంటే హీరోలు వాళ్ల దృష్టిలో. అలాంటి వాతావరణం ఉండేది ఒకప్పుడు. బట్.. ఎప్పుడైతే ప్రతీదీ హింసతోనే సాధ్యమని ఓవైపు తీసుకున్నారో.. అప్పుడే పోరాటమూ బలహీనపడింది. బస్సులు, రైళ్లు, ప్రభుత్వ ఆఫీసులు తగలబెట్టడం, బాంబులతో పేల్చేయడం.. ఇదంతా ఏంటన్న ప్రశ్న ఉదయించింది. ఎంతకాదన్నా.. అవి ప్రజల ఆస్తులు. ఎవరి కోసమైతే పోరాడుతున్నారో.. అదే పోరాటంలో అమాయకులూ సమిధలయ్యారు. ఒకనాడు పిలిస్తే పలికారు. రానురాను అరిచినా.. కనలేని, వినలేని దూరానికి వెళ్లిపోయారు. ఇప్పుడు.. పిలిచినా ఎన్నటికీ రానంతగా కనుమరుగయ్యారు. మావో రహిత తెలంగాణ.. ఇదెలా సాధ్యమైందో చెప్పుకునే ముందు.. మావో రహిత భారత్గా ఎలాంటి వ్యూహంతో కదిలారో తెలుసుకోవాలి. ఆపరేషన్ కగార్.. 2024 జనవరి 1న మొదలైంది. కాని, మావోల ఏరివేతను మొదలుపెట్టింది 2019లో.. మన్మోహన్ సింగ్ హయాంలో. ‘ఇక అంతం తప్పదు’ అని వాడింది ఆయనే. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, బిహార్, మహారాష్ట్ర.. ఇలా 10 రాష్ట్రాల్లోని 61 జిల్లాల్లో 245 పోలీస్ స్టేషన్ల పరిధిలోని మావోల బలం, బలగంపై ఫోకస్ పెట్టారు. పక్కా ప్లానింగ్ అది. ముందుగా CRPF, ITBT,...