
రాగల 48 గంటల్లో తెలంగాణలో రాజకీయ వాతావరణం ఓ రేంజ్లో వేడెక్కబోతోంది. ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో దద్దరిల్లే అవకాశముంది. కారణం ఈనెల 8 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు. పేరుకు బడ్జెట్ సమావేశాలే ఐనా.. అంతకుమించి స్టఫ్ దొరకడం పక్కా. రేవంత్రెడ్డి అయామ్ రెడీ అంటుంటే.. వామప్ మీటింగులతో బిజీగా ఉన్నారు కేసీఆర్.. ఈనెల 8.. అంటే ఈ గురువారం నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు షురూ. రేవంత్ సర్కార్ ఏర్పడ్డ తర్వాత ఇది తొలి బడ్జెట్ సెషన్. ప్రవేశపెట్టబోయేది మధ్యంతర బడ్జెట్టే ఐనా, జరిగేది పదిరోజులే ఐనా అధికార-విపక్షాల మధ్య మంటలు మాత్రం మామూలుగా ఉండవు. అప్పులు అండ్ ఆరు గ్యారంటీలు.. ధరణి- దాని రద్దు గొడవ.. ఇరిగేషన్ ప్రాజెక్టులు- కేఆర్ఎంబీకి వాటి అప్పగింతలు.. ఇలా బడ్జెట్ కంటే బడ్జెట్యేతర అంశాలే ఇక్కడ కీలకం కాబోతున్నాయి.
ఇటీవలే చెలరేగిన కేఆర్ఎంబీ వివాదం అసెంబ్లీ వేదికగా మళ్లీ రాజుకోనుంది. ఇరిగేషన్ ప్రాజెక్టులపై శ్వేతపత్రం ఇస్తాం.. కాచుకో అంటూ రేవంత్ విసిరిన సవాల్ టేకప్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్కు రాబోతున్నారు కేసీఆర్. కృష్ణా బేసిన్ పరిధిలోని ఐదు జిల్లాల నేతలతో ఇవాళ ఉదయం 11 గంటలకు సమావేశమవుతారు. ఈ మారథాన్ భేటీ సాయంత్రం వరకు కొనసాగనుంది. కేఆర్ఎంబీకి సాగునీటి ప్రాజెక్టుల అప్పగింతపై లోతుగా చర్చించి, అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఎలా నిలదియ్యాలో ఇక్కడే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా నేతలకు దిశానిర్దేశం చేస్తారు గులాబీ బాస్. ముందస్తుగా నందినగర్లోని నివాసంలో సోమవారం కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. బీఆర్ఎస్పై చేస్తున్న ఆరోపణలకు దీటుగా జవాబివ్వడం, జలహక్కుల సాధనకు తాము పదేళ్లలో చేసిన కృషిని వివరించడం.. ఇదీ ఎజెండా.
అసెంబ్లీలో రీసౌండ్ ఇవ్వనున్న మరో టాపిక్ ధరణి. కోదండరెడ్డి నేతృత్వంలోని ధరణి అధ్యయన కమిటీ ఇప్పటికే మూడుసార్లు సమావేశమైంది. కలెక్టర్లతో, వివిధ శాఖల ప్రతినిధులతో చర్చించింది. ధరణి చట్టంతో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారం కోసం 35 మాడ్యూల్స్ను పరిశీలించింది. ధరణిపై మధ్యంతర నివేదిక సిద్ధమవుతోంది. ధరణితో జరిగిన నిర్వాకాల్ని ఏకరువు పెట్టడానికి సిద్ధమవుతోంది కాంగ్రెస్ పార్టీ . దీటుగా ఎదుర్కోడానికి రెడీ అంటోంది ఎబీఆర్ఎస్. సో.. రాగల 48 గంటల్లో అసెంబ్లీ వేదికగా ఉరుములు-మెరుపులు ఖాయమన్నమాట..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..