Telangana: ధరణి సమస్యలపై సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్ష.. కీలక ఆదేశాలు..

| Edited By: Srikar T

Jul 26, 2024 | 7:56 PM

ధరణి సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ధరణి పోర్టల్‎లో తలెత్తిన సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలన్నారు. సవరణలపై కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఉన్నతాధికారుల సమావేశంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతుల పట్టాదారు పాసుబుక్కులకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

Telangana: ధరణి సమస్యలపై సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్ష.. కీలక ఆదేశాలు..
Revanth Reddy
Follow us on

ధరణి సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ధరణి పోర్టల్‎లో తలెత్తిన సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలన్నారు. సవరణలపై కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఉన్నతాధికారుల సమావేశంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతుల పట్టాదారు పాసుబుక్కులకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సవరణలపై ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి, అందరి అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల అభిప్రాయాలు, సూచనల ఆధారంగా సమగ్ర చట్టం రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే అసెంబ్లీలోనూ చర్చ పెడదామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ఆ తరువాత పంచాయత్ రాజ్‌ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరు అయ్యారు. ఎల్.ఆర్‌.ఎస్ విధివిధానాల‌పై పూర్తి స్థాయిలో క‌స‌ర‌త్తు నిర్వ‌హించారు. ఎల్.ఆర్.ఎస్ వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల‌ని అధికారులకు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క సూచించారు. ఎల్.ఆర్.ఎస్ అనుమ‌తుల కోసం ప్ర‌జ‌లు చేసుకున్న ద‌ర‌ఖాస్తులు వీలైనంత వేగంగా ప‌రిష్క‌రించాల‌ని తెలిపారు. ఇందుకోసం 33 జిల్లాల్లో ప్ర‌త్యేకంగా ఒక టీముల‌ను రూపొందుకోవాల‌ని చెప్పారు. సిబ్బంది కొర‌త ఉంటే ఇత‌ర శాఖ‌ల నుంచి డెప్యుటేష‌న్ పై పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాల‌న్నారు. ఈ సమావేశానికి మంత్రులతో పాటూ.. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, మాజీమంత్రి జానారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ధరణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభారణం కృష్ణ మోహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..