KCR Karimnagar Tour: నేడు కరీంనగర్‌లో పర్యటించనున్న సీఎం కేసీఆర్‌.. దళిత బంధుపై సమీక్ష.

|

Aug 27, 2021 | 6:36 AM

KCR Karimnagar Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు (శుక్రవారం) కరీంనగర్‌లో పర్యటించనున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి ఇప్పటికే కరీంనగర్‌ చేరుకున్నారు. గురువారం రాత్రి...

KCR Karimnagar Tour: నేడు కరీంనగర్‌లో పర్యటించనున్న సీఎం కేసీఆర్‌.. దళిత బంధుపై సమీక్ష.
CM Kcr
Follow us on

KCR Karimnagar Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు (శుక్రవారం) కరీంనగర్‌లో పర్యటించనున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి ఇప్పటికే కరీంనగర్‌ చేరుకున్నారు. గురువారం రాత్రి హెలికాప్టర్‌లో హన్మకొండ వెళ్లిన సీఎం.. అక్కడ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ కుమారుడి వివాహానికి హాజరయ్యారు. అనంతరం రోడ్డు మార్గంలో అక్కడి నుంచి కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లిలో ఉన్న నివాసానికి చేరుకున్నారు. రాత్రి సీఎం అక్కడే బస చేశారు.

ఇక శుక్రవారం ఉదయం 10.30 గంటలకు అలుగునూరులో జరిగే టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్మిక సంఘం మాజీ అధ్యక్షుడు రూప్‌సింగ్‌ కుమార్తె వివాహానికి సీఎం హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు కరీంనగర్‌ కలెక్టరేట్ వెళ్లనున్నారు. అక్కడ మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులతో కలిసి ‘దళితబంధు’ పథకంపై సమీక్ష నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే దళిత బంధు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 2000 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్‌ నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.

Also Read: Collector Bungalow: జిలా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజ్‌కు తప్పిన పెను ప్రమాదం.. బంగ్లాపై కప్పు కూలిన వైనం..

Fire Accident: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అగ్నిప్రమాదం.. బ్యాంక్‌లో చెలరేగిన మంటలు..

మానవులు ఏలియన్స్‏గా మారిపోవచ్చా ? ఈ పని చేస్తే అయ్యే అవకాశం ఉందంటున్న నిపుణులు..