Telangana: ఛీ.. ఛీ మరీ ఇంత దిగజారుడుతనమా.. కట్నం ఇవ్వలేదని పెళ్లి పీటలపై నుంచే పారిపోయిన వరుడు

|

May 27, 2023 | 8:02 PM

సంగారెడ్డి జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కట్నం సరిపోలేదని పెళ్లిపీటలపై నుంచి పెళ్లి కొడుకు పారిపోవడం స్థానికంగా సంచలనం రేపింది. వివరాల్లోకి వెళ్తే మనూరు మండలానికి చెందిన యువతి, అలాగే కొండాపూర్ మండలానికి చెందిన యువకుడు ప్రేమించుకుంటున్నారు.

Telangana: ఛీ.. ఛీ మరీ ఇంత దిగజారుడుతనమా.. కట్నం ఇవ్వలేదని పెళ్లి పీటలపై నుంచే పారిపోయిన వరుడు
Marriage
Follow us on

సంగారెడ్డి జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కట్నం సరిపోలేదని పెళ్లిపీటలపై నుంచి పెళ్లి కొడుకు పారిపోవడం స్థానికంగా సంచలనం రేపింది. వివరాల్లోకి వెళ్తే మనూరు మండలానికి చెందిన యువతి, అలాగే కొండాపూర్ మండలానికి చెందిన యువకుడు ప్రేమించుకుంటున్నారు.కానీ అతనికి తమ కూతురుని ఇచ్చేందుకు యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. మరో విషయం ఏంంటే ఈ ఏడాది జనవరిలోనే కంగ్టి మండలానికి చెందిన మరో యువకుడితో ఆ అమ్మాయికి నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు అతనికి ఫోన్‌ చేసి… తాను ఆమెను ప్రేమిస్తున్నానని, వదిలేయాలంటూ బెదిరించాడు. దీంతో అతను పెళ్లికి నిరాకరించాడు. చివరికి ప్రేమికులిద్దరికీ పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయి.

శుక్రవారం రోజున కొండాపూర్ మండలంలోని ఓ గుడిలో వివాహానికి సర్వం సిద్ధం చేశారు. ఇక పెళ్లి రోజున అంతా సక్రమంగా సాగుతున్న క్రమంలో పెళ్లి కొడుకు కట్నం చాలలేదంటూ వాగ్వాదానికి దిగాడు. రూ.15 లక్షలు కట్నం ఇస్తేనే తాళి కడతానని పెళ్లి కొడుకు తేల్చిచెప్పాడు. యువతి కుటుంబ సభ్యులు అంత ఇవ్వలేమని రూ.6 లక్షలు ఇస్తామని చెప్పినా వినలేదు. చివరికి పెళ్లి పీటలపై నుంచి పరారయ్యాడు. ఆ వరుడి కోసం బంధుమిత్రులు ఎంత వెతికినా, ఫోన్ చేసినప్పటికీ అతని జాడ కనిపించలేదు. ఇక చేసేదేమి లేక బాధిత వధువు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి