తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనయుడు భగీరథ్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాడు. తనను యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేయడంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కాలేజీలో స్టూండెట్స్ని కొట్టాడనే కారణంతో భగీరథ్ను సస్పెండ్ చేసింది మహేంద్ర యూనివర్సిటీ. జనవరి 20వ తేదీన భగీరథ్పై యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే, తనపై తీసుకున్న చర్యలను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించాడు భగీరథ్. తనను ఎలాంటి వివరణ అడగకుండానే యూనివర్సిటీ సస్పెండ్ చేసిందని కోర్టుకు తెలిపాడు. తాను ఇంటర్నల్ పరీక్షలు రాసేలా అనుమతి ఇవ్వాలని కోర్టును కోరాడు భగీరథ్. పిటిషన్ను విచారించిన హైకోర్టు.. భగీరథ్ సస్పెన్షన్పై కోర్టు స్టే విధించింది. పరీక్షలు రాసేందుకు అనమతి ఇవ్వాలని మహేంద్ర యూనివర్సిటీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో పరీక్షలు రాశాడు భగీరథ్. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు భగీరథ్ను క్లాస్లోకి అనుమతించాలని యూనివర్సిటీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..