Etela Rajender: వివరణ తీసుకోకుండా విచారణకు ఆదేశించారు.. కుట్ర చేస్తున్నదెవరో త్వరలో బయట పడుతుందన్న ఈటల

|

May 01, 2021 | 11:24 AM

తనపై వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తనపై విచారణ జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు.

Etela Rajender: వివరణ తీసుకోకుండా విచారణకు ఆదేశించారు.. కుట్ర చేస్తున్నదెవరో త్వరలో బయట పడుతుందన్న ఈటల
Etela Rajender
Follow us on

Minister Etela Rajender Interview: ఎవరికైనా సమస్య వస్తే మంత్రిదగ్గరకు వెళ్తారు. ఆదుకోండని మొర పెట్టుకుంటారు. అలాంటిది మంత్రే సమస్యగా మారితే.. ఆయన అనచురులే సమస్యలు సృష్టిస్తే..!? మంత్రి ఈటల విషయంలో జరిగింది అదే. ఈటల, ఆయన అనుచరులు తమ అసైన్డ్‌ భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారంటూ బాధితులు ఏకంగా సీఎం కేసీఆర్‌కు విన్నవించారు. దీనిపై విచారణ మొదలైంది.

అయితే తనపై వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరగాలని కోరుకుంటున్నానని ఈటల తెలిపారు. ఈ మేరకు మరిన్ని కీలక విషయాలను టీవీ 9 ఇంటర్వ్యూలో తెలిపారు. తానూ కూడా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నన్నారు. మచ్చలేని నేతగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తనపై ఆరోపణలు రావడం తట్టుకోలేకపోతున్నట్లు ఈటల అన్నారు.

తన వివరణ తీసుకోకుండా సీఎం ఆదేశాలివ్వడం బాధాకరమన్నారు మంత్రి ఈటల రాజేందర్. తనపై కుట్ర జరుగుతోందన్నారు. కుట్ర చేస్తున్నవారెవరో వారి పేర్లను త్వరలో బయటపడుతుందన్నారు. రూ.100 కోట్లు పోయినా ఈటల రాజేందర్‌ భయపడడు.. కార్యకర్తలు, అభిమానులు తొందరపడొద్దన్నారాయన. మూడు రోజులుగా కేటీఆర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా.. ఆయన తనకు అందుబాటులోకి రావడం లేదని ఆరోపించారు. కేసీఆర్‌కు కరోనా రావడంతో ఆయనను కలవలేకపోయానని ఈటల తెలిపారు. తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న వార్త సంస్థలో తన ఆస్తులను సెక్యూరిటీగా పెట్టినట్లు గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ తన నుంచి కనీసం వివరణ తీసుకోకుండా విచారణ ఆదేశించడం బాధకరం అని ఈటల అవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ సిద్ధాంతాల మేరకు నడుచు కొన్న వ్యక్తిని తనని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు అన్ని విషయాలు తెలుసని స్పష్టం చేశారు.

Read Also….  Land Grab Allegations: ఆ మంత్రులు కూడా ‘బీసీ’లే.. ఈటల విషయంలో రాజకీయాలు తగదు: వేణుగోపాలచారి