Telangana News: ఏడుగురు సభ్యుల దొంగల ముఠా.. చేసేవన్నీ అలాంటి చోరీలే.. షాకింగ్ వివరాలు మీకోసం..!

|

Jan 20, 2022 | 9:06 AM

Telangana News: గ్యాస్‌ కట్టర్లతో బ్యాంక్‌ లాకర్లు కత్తిరిస్తూ.. దోపిడీలకు పాల్పడుతున్న యూపీకి చెందిన దొంగల ముఠాను..

Telangana News: ఏడుగురు సభ్యుల దొంగల ముఠా.. చేసేవన్నీ అలాంటి చోరీలే.. షాకింగ్ వివరాలు మీకోసం..!
Follow us on

Telangana News: గ్యాస్‌ కట్టర్లతో బ్యాంక్‌ లాకర్లు కత్తిరిస్తూ.. దోపిడీలకు పాల్పడుతున్న యూపీకి చెందిన దొంగల ముఠాను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఆసిఫాబాద్‌ జిల్లా అడలో, కొత్తగూడెం జిల్లాలో బ్యాంకుల్లో చోరీలకు పాల్పడిన ఏడుగురు సభ్యుల ముఠాను తెలంగాణ పోలీసులు విజయవాడలో అరెస్ట్ చేశారు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అడ గ్రామంలో డిసెంబర్ 6న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దొంగతనం జరిగింది. గ్యాస్ కట్టర్‌తో బ్యాంకులోకి చొరబడి 7 లక్షల 31 వేల రూపాయలు దోచుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పోలీస్‌స్టేషన్ పరిధిలోనూ గ్యాస్ కట్టర్‌తో బ్యాంక్‌ లాకర్‌ కత్తిరించి దొంగతనం చేసినట్టు ముఠా ఒప్పుకుంది. ఈ రెండు కేసుల్లోనూ ఉమ్మడిగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ముఠాను విజయవాడలో అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also read:

Viral Video: స్కూటీతో స్టంట్స్ చేయాలనుకుంది.. బెడిసికొట్టి బొక్కబోర్లా పడింది.. వైరల్ వీడియో మీకోసమే!

Paracetamol Side Effects: పారాసెటమాల్ టాబ్లెట్లు అతిగా వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఇవి తెలుసుకోండి!

Astro Tips: ఈ చెట్టు దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది.. కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది..!