Dharan: నిజంగా “దందా” జరిగిందా? ఆధారాలు దొరికాయా? పొంగులేటి పేలుతుందన్న బాంబ్‌ అదేనా..?

ధరణి వచ్చాకే లక్షల ఎకరాల భూకబ్జా జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నిషేధిత జాబితా భూములను ఆక్రమించారని కాంగ్రెస్ ఆరోపణ. 'ప్రొహిబిటెడ్' భూములను పట్టా భూమిగా మార్చారన్న కాంగ్రెస్, గత ప్రభుత్వంలో అవకతవకలపై ధరణి కమిటీ ఫోకస్ చేసింది

Dharan: నిజంగా దందా జరిగిందా? ఆధారాలు దొరికాయా? పొంగులేటి పేలుతుందన్న బాంబ్‌ అదేనా..?
Dharani

Updated on: Oct 24, 2024 | 9:43 PM

ధరణి ఓ అద్భుతం అని బీఆర్ఎస్. ధరణి దోపిడీకి కేరాఫ్ అని కాంగ్రెస్‌. ఈ రెండు పార్టీల మధ్య జరిగిన అసెంబ్లీ వార్‌లో ‘ధరణి’ ఓ ఎలక్షన్‌ టాపిక్ అప్పట్లో. ఎన్నికలయ్యాయి.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చింది. మరి ధరణిపై లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఏంటి? దీపావళి లోపు పొలిటికల్‌ బాంబ్‌ పేలుతుందన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. వాటిలో ధరణి పేరు కూడా ప్రస్తావించారు. అంటే.. ధరణి పేరుతో భూదందా ఏమైనా జరిగిందా? దానికి సంబంధించిన ఆధారాలు దొరికాయా? ఇంతకీ ధరణి విషయంలో ఏం చేయబోతున్నారన్నదీ తెలంగాణ వ్యాప్తంగా చర్చ మొదలైంది. ‘భూసమస్య’ అనేది చూడ్డానికి నాలుగక్షరాలే. కాని, ప్రభుత్వాలను మార్చేంత శక్తి ఉంది. భూమి పోతోందన్న ఆవేదన ఉంటే.. ఎన్ని రైతు బంధులు, ఎన్ని రైతు భరోసాలు ఉన్నా జనం పట్టించుకోరు. భూమికి సంబంధించిన ఇష్యూ కారణంగా.. ఏపీలో ఎలక్షన్‌ మూడ్‌ మారిపోయింది. అదే భూ సమస్యను ధరణి రూపంలో హైలెట్‌ చేయడం కూడా కాంగ్రెస్‌కు కలిసొచ్చింది. ‘భూసమస్య’ అని తేలిగ్గా తీసుకోడానికి లేదు. అందుకే, రేవంత్‌ రెడ్డి సర్కార్‌ దీనికి అంత ఇంపార్టెన్స్ ఇస్తోంది. ధరణిని ప్రవేశపెట్టడానికి ముందు.. నాటి సీఎం కేసీఆర్‌ 2020లో ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్‌ గుర్తు చేసుకోవాలిక్కడ. ‘తెలంగాణ వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో, ఇవాళ అంత సంతోషంగా ఉన్నాను’ అంటూ మాట్లాడారు కేసీఆర్. కారణం.. ఆనాడు ధరణిని ప్రవేశపెడుతుండడమే. భూ నిర్వహణలో అవినీతి రహితంగా, బలహీనులకు మేలు చేసే...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి