
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) తన వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. సాంకేతిక మార్పులు మరియు మెరుగైన భద్రత కారణాల దృష్ట్యా, త్వరలోనే కొన్ని పాత మోడల్ స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి.
మెటా (Meta) యాజమాన్యంలోని వాట్సాప్ వెల్లడించిన వివరాల ప్రకారం, సెప్టెంబర్ 8, 2026 నుండి ఆండ్రాయిడ్ 6.0 (Android 6.0) కంటే తక్కువ వెర్షన్ ఉన్న ఫోన్లలో వాట్సాప్ పని చేయదు. అంటే ప్రస్తుతం మీ ఫోన్ ఆండ్రాయిడ్ 5.0 లేదా 5.1 వెర్షన్పై నడుస్తుంటే, మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.
వాట్సాప్ నిరంతరం కొత్త ఫీచర్లను (ఉదాహరణకు: నోటిఫికేషన్ బబుల్స్) ప్రవేశపెడుతోంది. ఈ అత్యాధునిక ఫీచర్లు పాత హార్డ్వేర్, సాఫ్ట్వేర్లపై సరిగ్గా పనిచేయవు. యాప్ పనితీరును వేగవంతం చేయడానికి, భద్రతను పెంచడానికి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. దీని ప్రభావం ముఖ్యంగా భారత్, బ్రెజిల్, పాకిస్థాన్ వంటి దేశాల్లోని పాత ఫోన్ వినియోగదారులపై పడనుంది.
మీ ఫోన్ ఈ మార్పు వల్ల ప్రభావితం అవుతుందో లేదో తెలుసుకోవడానికి ఈ క్రింది దశలను అనుసరించండి:
ఇది కూడా చదవండి: Gold Reserves: ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశాలు ఏవి? భారతదేశం ఎక్కడ ఉంది?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి