
ఆకలేస్తే ఆహారం అడిగే రోజులు పోయి, తినేటప్పుడు స్మార్ట్ ఫోన్ కావాలని డిమాండ్ చేసే తరం పెరిగింది. ఈ ఫోన్ వ్యసనం పిల్లల్లో శారీరక, మానసిక వికాసాన్ని అడ్డుకుంటోంది. క్రియేటివిటీ లోపించడం నుండి నిద్రలేమి సమస్యల వరకు ఈ అలవాటు ఎన్నో ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. పిల్లలను స్మార్ట్ జాంబీలుగా మార్చే ఈ తీవ్రమైన సమస్యపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
పిల్లలు ఫోన్ చూస్తూ తినేటప్పుడు పూర్తిగా అందులో మునిగిపోయి, తాము ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో కూడా గ్రహించలేని స్థితిని ‘స్మార్ట్ జాంబీ’ అంటారు. జపాన్లో నిర్వహించిన ఒక అధ్యయనంలో, ఈ అలవాటు పిల్లల సహజ ఎదుగుదలను మందగింపజేస్తుందని తేలింది. తినేటప్పుడు మెదడు ఆహారం రుచిని, సంతృప్తిని గ్రహించాల్సిన అవసరం ఉంటుంది, కానీ ఫోన్ కారణంగా ఆ ప్రక్రియ పూర్తిగా దెబ్బతింటోంది.
ఫోన్లకు అతుక్కుపోవడం వల్ల పిల్లలు ప్రకృతికి, ఆటలకు దూరమవుతున్నారు. దీనివల్ల వారిలో సృజనాత్మకత, ఏకాగ్రత, మరియు స్థిత ప్రజ్ఞత వంటి ముఖ్యమైన నైపుణ్యాలు లోపిస్తున్నాయి. ముఖ్యంగా టీనేజర్లలో ఈ ఫోన్ అడిక్షన్ వల్ల ఆందోళన , ఒత్తిడి , మరియు నిద్రలేమి సమస్యలు తలెత్తుతున్నాయి. మెదడు పనితీరు మందగించడం, జ్ఞాపక శక్తి తగ్గడం వంటి లక్షణాలు వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇతరులతో పోలిస్తే ఇలాంటి అలవాటు ఉన్న పిల్లలు ఎక్కువగా కుంగుబాటు ఇతర మానసిక రుగ్మతల బారిన పడుతున్నారని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఈ సమస్యకు ప్రధాన పరిష్కారం నివారణే. పిల్లలకు చిన్నతనం నుంచే ఫోన్ చూడటం తప్పనిసరి అనే భావన కలిగించకూడదు.
పిల్లల భవిష్యత్తు కోసం స్మార్ట్ ఫోన్ వ్యసనం నుంచి వారిని కాపాడుకోవడం పేరెంట్స్ బాధ్యత. సాంకేతికత ఎంత పెరిగినా, పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు శారీరక శ్రమ, సామాజిక సంబంధాలు ఎంతో ముఖ్యం. మీ పిల్లలు స్మార్ట్ జాంబీలుగా మారకుండా, చురుకైన మరియు ఆరోగ్యకరమైన వ్యక్తులుగా ఎదగాలంటే, ఇప్పటి నుంచే ఈ అలవాటును మార్చడం అత్యంత అవసరం.