గాలిని వడపోత వ్యవస్థ ద్వారా యంత్రంలోకి పంపించి, తేమతో నిండి ఉన్న కలుషితాలను ఫిల్టర్ చేస్తుంది. తర్వాత శుభ్రపరిచిన గాలిని ఒక గదిలోకి పంపబడుతుంది. అక్కడ గాలి ఘనీకృత రూపంలో ఉంటుంది. అలా ఉన్న గాలి నీటిగా మార్చబడుతుంది. ఈ ప్రక్రియ ద్వారా గాలి నుంచి నీటిని తయారు చేస్తారు. ఈ పద్ధతి ద్వారా తయారైన నీరు సురక్షితమైనది అని జలవనరుల మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ఈ పద్ధతి ద్వారా రోజుకు 1000 లీటర్ల నీరు ఉత్పత్తి జరుగుతుంది. ప్రయాణికులు తమ సొంత బాటిల్ తీసుకువస్తే లీటరకు రూ.5, లేకుంటే లీటరకు రూ.8 వసూలు చేస్తున్నారు. కాగా, ఇటువంటి కియోస్క్ ఏర్పాటుకు కృషి చేసిన జోన్ అధికారులను, సిబ్బందిని ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ గజనన్ మాల్యా ప్రశంసించారు. త్వరలో ఇతర రైల్వే స్టేషన్ ల్లలో కూడా ఈ నీరు అందుబాటులోకి తీసుకురావటానికి ఏర్పాటు చేస్తామని తెలిపారు.