
స్కామర్లు తెలివిమీరిపోయారు. అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతికతతో వినియోగదారులకు ఎంత సౌకర్యం కలుగుతుందో.. అంతే స్థాయిలో ప్రమాదం కూడా పొంచి ఉంది. సైబర్ నేరగాళ్లు మనం ఎన్ని సెక్యూరిటీ చెక్ లను పెట్టుకుంటున్నా.. ఏదో రకంగా దాడి చేస్తూనే ఉన్నారు. ఏదో ఒకరకంగా మన వ్యక్తిగత డేటాను దొంగిలిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరో కొత్త తరహా మోసాన్ని పరిశోధకులు గుర్తించారు. అది కూడా మన సెల్ ఫోనే. మన సెల్ ఫోన్ లోని టెక్ట్స్ మెసేజ్ యాప్ ద్వారా ఫోన్ వినియోగదారుల లోకేషన్ ను ట్రాక్ చేస్తున్నారని కనుగొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఫోన్ లోని టెక్స్ట్ మెసేజింగ్లో కొత్త తరహా మోసానికి అవకాశం ఉండే పరిస్థితిని పరిశోధకులు గుర్తించారు. ఇది వినియోగదారుల లోకేషన్లను కనుగొనడానికి హ్యాకర్లకు సాయం చేస్తుందని నిర్ధారించారు. యూఎస్-ఆధారిత ఈశాన్య విశ్వవిద్యాలయ పీహెచ్ డీ విద్యార్థి ఎవాంజెలోస్ బిట్సికాస్ నేతృత్వంలోని పరిశోధనా బృందం దీనిని కొనుగొంది. హ్యాకర్లు ఫోన్ లోని మెషిన్-లెర్నింగ్ ప్రోగ్రామ్, ఎస్ఎంఎస్ సిస్టమ్ నుండి డేటాను ఉపయోగించి వినియోగదారు లోకేషన్ ను ట్రాక్ చేస్తారని గుర్తించింది. వినియోగదారుడి ఫోన్ నంబర్, సాధారణ నెట్వర్క్ యాక్సెస్ను పొందడం ద్వారా, హ్యాకర్లు ఆ వినియోగదారుడు ప్రపంచంలో ఎక్కడున్న ట్రాక్ చేయగలుతారు.
ఎస్ఎంస్ భద్రతలో కొన్ని అప్ డేట్లు వచ్చినప్పటికీ డెలివరీ నోటిఫికేషన్ల సమయం కారణంగా ఈ లోపం వస్తోందని పరిశోధకుల బృందానిని నేతృత్వం వహిస్తున్న బిడ్సికాస్ చెప్పారు. మనం ఎస్ ఎంఎస్ పంపినప్పుడు ఆటోమేటెడ్ డెలివరీ నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఫీచర్లే నేరగాళ్లు వాడుకుంటున్నట్లు గుర్తించినట్లు వివరించారు. వినియోగదారు మెసేజ్ స్వీకరించినప్పుడు, వారి ఫోన్ వారి స్థానాన్ని సూచించే టైమ్స్టాంప్తో స్వయంచాలకంగా డెలివరీ రసీదుని పంపుతుంది. ఈ ఫీచర్ మొదట్లో సమస్యాత్మకం కానప్పటికీ, బిట్సికాస్ చెబుతున్న దాని ప్రకారం, హ్యాకర్లు ఇప్పుడు మెషీన్ లెర్నింగ్ని ఉపయోగించి ఈ టైమ్స్టాంప్లను గుర్తించగల, వినియోగదారు లోకేషన్ గుర్తించగల ఒక అల్గారిథమ్ను రూపొందించారని వివరిస్తున్నారు. ఇందుకోసం వినియోగదారుడి ఫోన్ నంబర్ మాత్రం చాలని చెబుతున్నారు. ఎన్ని ఎక్కువ మెసేజ్ పంపితే అంత ఈజీగా మీ లోకేషన్ ను ట్రాక్ చేస్తారంటున్నారు.
ఎస్ఎంఎస్ ద్వారా లొకేషన్లను ట్రాక్ చేయడానికి మెషిన్ లెర్నింగ్ని ఉపయోగించే హ్యాకర్ల కేసులు ఏవీ ఇప్పటి వరకూ ఒక్కటి కూడా బహిర్గతం కాలేదు. కానీ ఇలా కూడా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కొన్ని రక్షణ చర్యలు తీసుకోవడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. అంవేంటో చూద్దాం..
ఎస్ఎంఎస్ తో జాగ్రత్తగా ఉండండి.. సున్నితమైన కమ్యూనికేషన్ల కోసం సంప్రదాయ ఎస్ఎంఎస్ ను వినియోగించకండి. పటిష్టమైన భద్రతా ఫీచర్లను అందించే వాట్సాప్ వంటి ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్లను ఉపయోగించండి.
రెగ్యులర్ అప్డేట్లు.. మీకు తాజా భద్రతా ప్యాచ్లు,మెరుగుదలలు ఉన్నాయని నిర్ధారించుకోవడానికి మీ స్మార్ట్ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్, యాప్లను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయండి.
మీ ఫోన్ నంబర్ను షేర్ చేయొద్దు.. మీ ఫోన్ నంబర్ను పబ్లిక్గా, ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో షేర్ చేయొద్దు.
రీడ్ రిసిప్ట్స్ నిలిపివేయండి.. మీ ఫోన్ సెట్టింగ్లను తనిఖీ చేయండి. వీలైతే ఎస్ఎంఎస్ కోసం రీడ్ రిసిప్ట్స్ నిలిపివేయండి.
సైబర్ సెక్యూరిటీపై అవగాహన.. తాజా బెదిరింపుల గురించి, ఆన్లైన్లో మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో తెలుసుకోండి. అందుకోసం సైబర్ సెక్యూరిటీపై అవగాహన కలిగి ఉండాలి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..