Cyber Crime: సైబర్‌ నేరాల బారిన పడ్డారా, ఖాతాలో సొమ్ము పోయిందా.? వెంటనే ఇలా చేస్తే మీ మనీ సేఫ్..

Cyber Crime: సైబర్‌ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రపంచంలో ఎక్కడో ఉండి మన ఖాతాల్లో డబ్బులు కాజేస్తున్నారు కేటుగాళ్లు. రకరకాల మాల్వేర్‌లను సృష్టిస్తూ కంప్యూటర్‌లు, స్మార్ట్‌ ఫోన్‌లలోకి చొరబడి..

Cyber Crime: సైబర్‌ నేరాల బారిన పడ్డారా, ఖాతాలో సొమ్ము పోయిందా.? వెంటనే ఇలా చేస్తే మీ మనీ సేఫ్..
Cyber Crime

Updated on: Jul 01, 2022 | 9:50 AM

Cyber Crime: సైబర్‌ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రపంచంలో ఎక్కడో ఉండి మన ఖాతాల్లో డబ్బులు కాజేస్తున్నారు కేటుగాళ్లు. రకరకాల మాల్వేర్‌లను సృష్టిస్తూ కంప్యూటర్‌లు, స్మార్ట్‌ ఫోన్‌లలోకి చొరబడి డబ్బులు నొక్కేస్తున్నారు. ఇప్పటికీ చాలా మందికి అసలు తాము మోసపోయామనే విషయం కూడా తెలియడం లేదు. తీరా తేరుకొని చూసుకునే సరికి బ్యాంక్‌ అకౌంట్లో ఉండాల్సిన డబ్బులు కాస్త మాయం అవుతున్నాయి. అయితే ఎప్పుడైనా సరే సైబర్‌ నేరాల బారిన పడినట్లు అనుమానం వచ్చిన, అకౌంట్లో డబ్బులు అకారణంగా మైనస్‌ అయినా వెంటనే ఓ పని చేస్తే పోయిన డబ్బులను తిరిగి పొందే అవకాశం ఉందని మీకు తెలుసా.?

ఇదే విషయమై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బులు తిరిగివచ్చే అవకాశం ఉందని తెలిపారు. అకౌంట్లో డబ్బులు పోయిన వెంటనే సైబర్‌ క్రైం పోర్టల్‌లో కానీ, 1930 హెల్ప్‌లైన్‌ నెంబర్‌కి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇలా చేయడం ద్వారా మన అకౌంట్‌లో నుంచి ట్రాన్స్‌పర్‌ అయిన సొమ్ము ఇతర ఖాతాలకు బదిలీ అవ్వకుండా నిలిపివేసే అవకాశం ఉంటుంది. ఈ కాల్‌ సెంటర్‌ 24/7 అందుబాటులో ఉంటుంది. ఇలా ఇప్పటి వరకు సైబర్‌ నేరగాళ్లు కాజేసి రూ. 15.48 కోట్లను బాధితుల ఖాతాల్లో నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా వీలైనంత త్వరగా ఫిర్యాదు చేయడం వల్ల నేరగాళ్ల ఖాతాల్లోని నగదు సీజ్‌ చేసే అవకాశం ఉంటుందని పోలీసులు వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us