
కృత్రిమ శ్వాసనాళం తయారీలో శాస్త్రవేత్తలు అత్యాధునిక విధానాన్ని అనుసరించారు. ముందుగా రోగి శరీర నిర్మాణానికి అనుగుణంగా బయోడీగ్రేడబుల్ స్కాఫోల్డ్తో శ్వాసనాళాన్ని నిర్మించారు. ఆ స్కాఫోల్డ్పై రోగికి చెందిన మూలకణాలను నాటారు. కాలక్రమేణా ఆ కణాలు అభివృద్ధి చెంది జీవ కణజాలంగా మారాయి. ఈ క్రమంలో స్కాఫోల్డ్ నెమ్మదిగా కరిగిపోయి, చివరకు పూర్తిగా సహజమైన శ్వాసనాళం మిగిలిపోయింది. ఇది పూర్తిగా రోగి సొంత కణాలతో తయారైనది కావడంతో, శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ దీనిని తిరస్కరించే ప్రమాదం ఉండదు.
ఈ త్రీడీ ప్రింటింగ్ సాంకేతికత భవిష్యత్తులో రక్త నాళాలు, కార్టిలేజ్ వంటి ఇతర శరీర భాగాల తయారీకి కూడా మార్గం సుగమం చేస్తుంది. అయితే, దీనిపై మరిన్ని పెద్దస్థాయి అధ్యయనాలు మరియు క్లినికల్ ట్రయల్స్ జరగాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ క్లినికల్ ట్రయల్స్ కూడా విజయవంతమైతే, వైద్య రంగంలో అవయవ మార్పిడి చికిత్సలలో సమూలమైన మార్పులు రావడం ఖాయం. పునరుత్పాదక వైద్య రంగంలో ఇది నిజంగానే ఒక పెద్ద ముందడుగు.